Share News

MLA SHRAVANISREE : సీఎం చంద్రబాబుతోనే రాషా్ట్రభివృద్ధి

ABN , Publish Date - Sep 23 , 2024 | 12:20 AM

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. మండలంలోని చామలూరులో ఆదివారం నిర్వహించిన ‘ఇది మంచి ప్రభు త్వం’ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు హాజరయ్యారు.

MLA SHRAVANISREE : సీఎం చంద్రబాబుతోనే రాషా్ట్రభివృద్ధి
MLA Shravanishree is going door to door and handing out leaflets

ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ

నార్పల, సెప్టెంబరు22: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. మండలంలోని చామలూరులో ఆదివారం నిర్వహించిన ‘ఇది మంచి ప్రభు త్వం’ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు హాజరయ్యారు. గ్రామంలోని పలు సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఆలం వెంకట నరసానాయుడు, మాజీ ఎంపీపీ ఆకుల అరుణ, ఆకుల ఆంజనే యులు, ఆకుల విజయ్‌కుమార్‌బాబు, ప్రతాప్‌చౌదరి, జాఫర్‌వలి, ఆకుల తేజ, ఆలంనాగార్జుననాయుడుతదితరులు పాల్గొన్నారు.


అనంతపురంరూరల్‌: మండలంలోని పాపంపేటలో అధికారులు, టీడీపీ నాయకులు ఆదివారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పీఆర్‌జేఈ శ్రీనివాసులురెడ్డి, పంచాయతీ కార్యదర్శి అశోక్‌ బాబు, సచివాలయం కార్యదర్శి మహేంద్రర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ వేణు గోపాల్‌, టీడీపీనాయకులు రామాంజినేయులు, బాబావలి, రత్నమోహన, అల్లీపీరా, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

రాప్తాడు: మండలంలోని బొమ్మేపర్తి గ్రామంలో ఆదివారం నిర్వహిం చిన ‘ఇది మంచి ప్రభుత్వం ’ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గ ప్రత్యేక అధికారి మురళికృష్ణ పాల్గొన్నారు. ఎంపీడీఓ సాల్మనరాజ్‌, స్థానిక అధికారులతో కలిసి ఇంటింటా పర్యటించి కార్యక్రమ ఉద్దేశం వివరించారు. స్టిక్కర్లను ప్రజలకు పంచారు. టీడీపీ మండల కన్వీనర్‌ కొండప్ప, పంచాయతీ కార్యదర్శి రామచంద్రారెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 23 , 2024 | 12:20 AM