Home » Telugu Desam Party
రబీ సీజన్లో 8లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని తీర్మానం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. సోమశిల నుంచి 55.100 టీఎంసీల నీటిని 5.51లక్షల ఎకరాలకు, కండలేరు నుంచి 22.600 టీఎంసీలతో 2.26లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
గత ఐదేళ్లలో పోలీసులు వైసీపీ సైకోలను నియంత్రించలేక పోయారని లీడ్ క్యాప్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు విమర్శించారు. పోలీసులు ఇకనైనా సైకో బ్యాచ్ చేస్తున్న అరాచకాల విషయంలో ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు. వైసీపీ వికృత ఆకృత్యాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు ఉన్నాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి రెడ్డి సత్యనారాయణ(99) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఇవాళ(మంగళవారం) ఉదయం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలోని తన స్వగ్రామం పెదగోగాడలో సత్యనారాయణ తుదిశ్వాస విడిచారు.
ఏపీ మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పోటెత్తుతున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట నివాసం వద్ద ఈ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరి సమస్య వింటూ పరిష్కారం చేస్తానని ఆయన హామీ ఇస్తుండటంతో ప్రతి ఒక్కరూ తమ సమస్యలు విన్నవించేందుకు బారులు దీరుతున్నారు.
విజయసాయి, అతని వియ్యంకుడు సగం రాష్ట్రాన్ని దోచేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఇక కేంద్ర మంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఏం మిగిలేది కాదని సోమిరెడ్డి విమర్శించారు.
జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవమానం జరిగింది. స్వాగత కార్యక్రమంలో మంత్రులకు మాత్రమే అధికారులు బొకేలు అందజేశారు. ఈ వేదికపై ఎంపీ వేమిరెడ్డి ఉన్నప్పటికీ అధికారులు విస్మరించారు.
సాక్షి ప్రకటనలకు ఖర్చుపెట్టిన రూ.300 కోట్లు కూడా కనీసం రోడ్లకు జగన్ ఖర్చు పెట్టలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. గత ఐదేళ్ల పాలనలో అధ్వాన రోడ్లతో ప్రమాదాలకు గురై ఆస్పత్రి పాలవడం, వాహన మరమ్మతులకు జేబులు గుల్లవడం చూశామని అన్నారు.
బడుగు, బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పెద్దపీట వేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తెలుగుదేశం ఆలోచిస్తుంటే... వైసీపీమాత్రం జీవితకాలం అధ్యక్షుడిని తానేనని విస్తృత స్థాయి సమావేశంలో పెట్టుకున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు.
సామర్లకోట, నవంబరు 1 (ఆంధ్రజ్యో తి): సామర్లకోట కుమార రామ భీమేశ్వరా లయంలో శనివారం నుంచి ప్రారంభం కా నున్న కార్తీకమాస నెల రోజుల ఉత్సవాలకు వచ్చే భక్తులకు సేవలందించడంలో నిర్లక్ష్యా న్ని ఎంతమాత్రం సహించబోమని పెద్దాపు రం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప దేవదాయ, వివి
విదేశాల నుంచి పరిశ్రమలు తెచ్చి ఏపీని అభివృద్ధి చేయడానికి అటు సీఎం చంద్రబాబు.. ఇటు మంత్రి నారా లోకేష్ ఎంతో కష్ట పడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కేవలం ఆబద్ధపు మాటలకే పరిమితమైందని భూమా అఖిలప్రియ మండిపడ్డారు.