Home » Telugu Desam Party
బడుగు, బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పెద్దపీట వేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తెలుగుదేశం ఆలోచిస్తుంటే... వైసీపీమాత్రం జీవితకాలం అధ్యక్షుడిని తానేనని విస్తృత స్థాయి సమావేశంలో పెట్టుకున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు.
సామర్లకోట, నవంబరు 1 (ఆంధ్రజ్యో తి): సామర్లకోట కుమార రామ భీమేశ్వరా లయంలో శనివారం నుంచి ప్రారంభం కా నున్న కార్తీకమాస నెల రోజుల ఉత్సవాలకు వచ్చే భక్తులకు సేవలందించడంలో నిర్లక్ష్యా న్ని ఎంతమాత్రం సహించబోమని పెద్దాపు రం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప దేవదాయ, వివి
విదేశాల నుంచి పరిశ్రమలు తెచ్చి ఏపీని అభివృద్ధి చేయడానికి అటు సీఎం చంద్రబాబు.. ఇటు మంత్రి నారా లోకేష్ ఎంతో కష్ట పడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కేవలం ఆబద్ధపు మాటలకే పరిమితమైందని భూమా అఖిలప్రియ మండిపడ్డారు.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం నుంచి ఏపీని గాడిలో పెడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రూ.10లక్షల కోట్లకు పైగా ఏపీపై అప్పు భారం ఉందని.. దానిని కూటమి ప్రభుత్వం మోస్తుందనే విషయం గ్రహించాలని అన్నారు. ఏపీ ఓ విషవలయంలో ఉందనే గుర్తించాలని అన్నారు.
గ్రామపంచాయతీల నిధులు కూడా మాజీ సీఎం జగన్ దోచుకున్నారని హోంమంత్రి అనిత విమర్శించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి సింపతీ క్రియేట్ చేయడం జగన్కి అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఆడపిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలన్నదే జగన్ ఆలోచన అని హోంమంత్రి అనిత విమర్శించారు.
ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు అప్పగించిన 48 గంటల్లోపు రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మొదటి రకం ధాన్యానికి మద్దతు ధర రూ. 2,350లకు కొంటామని తెలిపారు. రైతులకు నచ్చిన రైస్ మిల్లులో ధాన్యాన్ని రైతులు అమ్ముకోవచ్చుని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
వంగవీటి రాధా ఇంటికి మంత్రి నారా లోకేష్ ఈరోజు వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాధా త్వరగా కోలుకోవాలని నారా లోకేష్ ఆకాంక్షించారు.
సాక్షి మీడియా ఇప్పటికైనా వాస్తవాలు ప్రజలకు చెప్పాలని కోరుతున్నామని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. సాక్షి పత్రిక 2019లో తన పైన తప్పుడు రాతలు రాశారని మండిపడ్డారు. రూ. 75 కోట్ల పరువు నష్టం దావా వేశానని అన్నారు. ప్రజలపై భారంపడేలా ప్రభుత్వ వాహనాలు.. ఎకామిడేషన్ గాని వినియోగించలేదని చెప్పారు.
తప్పు చేసిన వారిని చట్టబద్దంగా శిక్షిద్దామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇష్టం వచ్చినట్లు అరెస్టులు జరగాలి అంటే కుదరదని తేల్చిచెప్పారు. అది తనవిధానం కాదని... తాను చెడ్డపేరు తెచ్చుకునేందుకు మాత్రం సిద్ధంగా లేనని చెప్పారు. ఇసుక విషయంలో ఎవరు వేలు పెట్టవద్దని నేతలను హెచ్చరించారు....ఇసుక విషయంలో తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించవద్దని అధికారులకు స్పష్టంగా చెప్పానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
తిరువూరులో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఇవాళ(ఆదివారం) జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ బ్యూరో సభ్యులు బలరామయ్య, గుంటూరు కృష్ణా జిల్లాల సమన్వయకర్త సత్యనారాయణ రాజు, ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వల్ల తలెత్తిన పరిణామాల నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో పలువురు టీడీపీ కార్యకర్తలు, శ్రేణులు పాల్గొన్నారు.