Home » TG News
సైనిక పాఠశాలల తరహాలో పోలీసుల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలో తొలి స్కూల్ను సీఎం రేవంత్రెడ్డి గురువారం ఉదయం ప్రారంభిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే ప్రమాదకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. బ్రిటిషర్లకంటే బీజేపీ ప్రమాదకరమంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలనకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) బుధవారం షెడ్యూల్ ప్రకటించింది.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద 2023 నవంబరు 29వ తేదీకి ముందు ఉన్న పరిస్థితిని పునరుద్ధరించే అంశంపై చర్చించడానికి త్వరలోనే కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తెలుగు రాష్ట్రాలతో సమావేశం కానుంది.
సీతారామ ఎత్తిపోతల పథకం (సీతమ్మసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు)లో భాగంగా నిర్మించ తలపెట్టిన బ్యారేజీ డిజైన్లు సరిగ్గానే ఉన్నాయని కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) అప్రైజల్ డైరెక్టరేట్ తెలిపింది.
హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్, హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎన్వీఎస్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ నియమించింది. ఇదివరకు పనిచేసిన ఆయా స్థానాల్లోనే మరో ఏడాది కాలానికి తిరిగి ఆయనను నియమిస్తూ జీవో నంబర్82ను ప్రభుత్వం జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్ఎ్సఆర్పీ)ను తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
బీజేపీ నేతలు.. బ్రిటిష్ వారికంటే ప్రమాదకారులని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఆనాడు అందరూ ఒక్కటై బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమికొట్టినట్లుగానే.. ఇప్పుడు రాహుల్గాంధీ నాయకత్వంలో అందరం ఒక్కటై దేశవ్యాప్తంగా బీజేపీని ఓడగొడదామని పిలుపునిచ్చారు.
పోస్టల్ సేవింగ్స్ ఖాతాదారులకు చెందిన రూ.79లక్షల నిధులను దుర్వినియోగం చేసిన బీహెచ్ఈఎల్ సబ్ పోస్ట్మాస్టర్ కు కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించింది.
ఆయుష్మాన్ భారత్, విశ్వకర్మ యోజన పథకాలను తెలంగాణలోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు.