Home » West Godavari
ఓ యువకుడు తన సెల్పీ వీడియోలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు.. అయితే ఇంత వరకు అతని ఆచూకీ లభ్యం కాలేదు. అప్పులు చేసి ఆన్ లైన్ బెట్టింగ్ ఆడానని.. అప్పుడు తీర్చే మార్గం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పశ్చిమ గోదావరి జిల్లా, యలమంచిలి మండలం, మేడపాడులో ఒక పౌల్ట్రీ ఫాంలో 5వేల 500 కోళ్లు మృతి చెందాయి. బర్డ్ ఫ్లూ సోకి చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం అధికారులు శాంపిల్స్ను భోపాల్ ల్యాబ్కు పంపించారు. కొల్లేరు వలస పక్షుల వలనే బర్డ్ ఫ్లూ కోళ్లకు సోకిందనే అనుమానం వ్యక్తమవుతోంది.
AP Govt: ఈ మధ్య కాలంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆకస్మికంగా భారీగా కోళ్లు చనిపోయాయి. ఒక్క గోదావరి జిల్లాలోనే 62 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో పశుసంవర్ధక శాఖ అధికారులు ఈ జిల్లాల్లోని కానూరు అగ్రహారం, వేల్పూరు ఫారాల నుంచి నమూనాలు సేకరించి పరిశీలించారు. అధికారుల సేకరించిన నమూనాల్లో బర్డ్ఫ్లూ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
గోదావరి జిల్లాలను బర్డ్ఫ్లూ వణికిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కానూరు అగ్రహారం, పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్ మండలం వేల్పూరులోని కోళ్లఫారాల్లో...
కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థి ఉరి వేసుకుని తనువు చాలించాడు.
Bird Flu : ఇటీవల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయి. ఈ ఒక్క జిల్లాలోనే ఏకంగా 62 వేల కోళ్లు మరణించడంతో రెడ్ అలర్డ్ ప్రకటించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఎన్డీయే ప్రభుత్వం గ్రామ పంచాయతీ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. అందులో భాగంగానే గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ, నిర్ణయాధికారం కల్పించిందని అన్నారు.
Woman trapped in Kuwait: పొట్టకూటి కోసం కువైట్కు వెళ్లిన ఏపీ మహిళ ఒకరు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కువైట్లో పనిలో పెట్టిన ఏజెంట్ సరిగా భోజనం పెట్టకుండా చిత్రహింసలకు గురి చేస్తుండటంతో..ఆమె తన బాధను వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేసింది.
పశ్చిమగోదావరి జిల్లా దువ్వలో సూర్యాలయం వద్ద భజన చేస్తున్న భక్తులపై ఆగంతకులు దాడి చేశారు. అయితే ఈ దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. రథ సప్తమి సందర్భంగా భక్తులు భజన చేస్తుంటే మైక్ లాక్కొని కొంతమంది దాడి చేశారు.
Raghurama: సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్పై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆకివీడులో నిన్న జరిగిన ఘటనపై సునీల్ బాధ్యత వహించాలన్నారు. సునీల్ అనుచరుడిని వెంటనే చర్యలు తీసుకోవాలని రఘురామ అన్నారు.