Home » Yarlagadda Venkatrao
‘పులివెందుల మరికొన్ని చోట్ల జగన్ ప్రజల నుంచి అర్జీలు తీసుకొంటున్నారు.
Minister Narayana: అమరావతి అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టౌన్ ప్లానింగ్పై దృష్టి పెట్టానని తెలిపారు. కమిటీలు ఏర్పాటు చేసి పనులు పూర్తి చేయాలని ఆదేశించానని మంత్రి నారాయణ అన్నారు.
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభకు రాని జగన్ శాసనమండలికి తన సభ్యులను ఎలా పంపుతున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండానే మైక్ ఇవ్వరేమోనన్న ఫోబియా ఆయనను వెంటాడుతోందని సెటైర్ విసిరారు.
జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు ప్రైవేట్ ఆస్తులు కొల్లగొట్టారు, ప్రభుత్వ ఖజానా లూటీ చేశారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. వైసీపీ హయాంలో రీసర్వే పేరిట భూములు కొట్టేశారని ఆరోపించారు. రీసర్వే పేరుతో ఊరికో భూబకాసురుడిని తయారుచేశారని ధ్వజమెత్తారు.
Andhrapradesh: క్రైసిస్ మెనేజ్మెంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు దారుణమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ తనకు ప్రతిపక్షహెూదా ప్రజలు ఇవ్వలేదని వారిపై కక్షకట్టారన్నారు.
భారీ వర్షాలకు గన్నవరం రూరల్ మండలం అంబాపురంలో దయనీయ పరిస్థితి ఏర్పడింది. గ్రామాన్ని వరదనీరు ముంచెత్తడంతో ప్రజలు రక్షించాలంటూ ఆక్రందనలు పెడుతున్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు సైతం గ్రామానికి చేరుకుని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కోసం వేచి చూస్తున్నారు. ఫోన్ చేసినా అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగాన్ని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ (Minister TG Bharath ) అన్నారు. ఏపీలో పారిశ్రామికవేత్తలు ఆందోళనలో ఉన్నారని, వైసీపీ పాలనలో వారిని పట్టించుకున్న నాథుడే లేడని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ {Vallabhaneni Vamsimohan) నివాసంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkatarao) స్పందించారు.
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం బెట్టింగ్ల్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారన్న దానితో సంబంధం లేకుండా కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏయే సీట్లు టీడీపీ ఖాతాలో పడతాయి? ఏవి వైసీపీ దక్కించుకుంటుంది అన్న వాటిపై ఎక్కువగా బెట్టింగ్లు నడుస్తున్నాయి.
అంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరుగుతున్న పోలింగ్ వేళ.. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ వెంకట్రావు విజయం ఖాయమైందని అందరికి అర్థమైపోయింది. ఆ క్రమంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి వల్లభనేని వంశీ అనుచరులు రెచ్చిపోయారు. సురంపల్లిలోని పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ పరిశీలిస్తున్న యార్లగడ వెంకట్రావుపై వారు దాడికి పాల్పడ్డారు.