అదిరిపోయే ఫీచర్లతో టీసీఎల్ కొత్త స్మార్ట్టీవీలు
ABN , First Publish Date - 2021-03-10T23:14:06+05:30 IST
అదిరిపోయే ఫీచర్లతో టీసీఎల్ కొత్త స్మార్ట్టీవీలు

న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ టీసీఎల్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో కొత్త స్మార్ట్టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్లో టీసీఎల్ పీ725 4కే హెచ్డీఆర్ ఎల్ఈడీ టీవీ సిరీస్ను విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది. కొత్త సిరీస్లో టీవీలు నాలుగు సైజుల్లో 43 అంగుళాలు, 50 అంగుళాలు, 55 అంగుళాలు, 55 అంగుళాల్లో కొత్త స్మార్ట్టీవీలు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది.
43 అంగుళాల వేరియంట్ కొత్త స్మార్ట్టీవీ ప్రారంభ ధర రూ. 41,990 ఉంటుందని పేర్కొంది. టీసీఎల్ టీవీలను అమెజాన్ ఇండియా, టీసీఎల్ ఇండియా ఆన్లైన్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చని సంస్థ తెలిపింది. ప్రీ-ఆర్డర్స్ మార్చి 20 నుంచి ప్రారంభంకానున్నాయి.