ఒకే ఒక్కడు ఆకాశ్
ABN , First Publish Date - 2022-09-29T09:29:46+05:30 IST
ప్రపంచంలోని 100 మంది వర్ధమాన నాయకులకు సంబంధించి ప్రముఖ టైమ్స్ మ్యాగజైన్ బుధవారం విడుదల చేసిన జాబితాలో ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి చోటు దక్కింది.

న్యూఢిల్లీ: ప్రపంచంలోని 100 మంది వర్ధమాన నాయకులకు సంబంధించి ప్రముఖ టైమ్స్ మ్యాగజైన్ బుధవారం విడుదల చేసిన జాబితాలో ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీకి చోటు దక్కింది. ఈ లిస్ట్లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు ఆకాశ్ అంబానీయే కావడం గమనార్హం. దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియోకు చైర్మన్గా 30 ఏళ్ల ఆకాశ్ ఈ ఏడాది జూన్లో పగ్గాలు చేపట్టారు. 22 ఏళ్ల వయసులోనే కంపెనీ బోర్డు సభ్యుడిగా చేరారు. కంపెనీలోకి గూగుల్, ఫేస్బుక్ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి వేల కోట్ల పెట్టుబడులను రాబట్టడంలో ఆకాశ్ కీలక పాత్ర పోషించారని టైమ్స్ మాగ్యజైన్ పేర్కొంది.