AP Minister: రోశయ్య ఆశీస్సులతోనే వేమూరు శాసనసభకు పోటీచేశా

ABN , First Publish Date - 2022-11-22T14:07:49+05:30 IST

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆశీస్సులతోనే 2009లో వేమూరు శాసనసభకు పోటీచేసినట్లు ఏపీ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు.

AP Minister: రోశయ్య ఆశీస్సులతోనే వేమూరు శాసనసభకు పోటీచేశా

హైదరాబాద్: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah) ఆశీస్సులతోనే 2009లో వేమూరు శాసనసభకు పోటీచేసినట్లు ఏపీ మంత్రి మేరుగ నాగార్జున (Meruga Nagarjuna) తెలిపారు. రోశయ్య (Former chiefminister of Joint Andhrapradesh) ప్రథమ వర్థంతి సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని రోశయ్య చిత్రపటానికి పూలమాటలు వేసి నివాళులర్పించారు. అనంతరం మేరుగ మాట్లాడుతూ... రోశయ్య వేమూరు ప్రాంతంలో పుట్టడం తమ అదృష్టమన్నారు. డిసెంబరు 4న‌ వేమూరులో ఏపీ ప్రభుత్వం తరుపున సంస్మరణ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. రోశయ్య ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తామని మంత్రి మేరుగ నాగార్జున (AP Minister)పేర్కొన్నారు.

Updated Date - 2022-11-22T14:07:50+05:30 IST