బుజ్జి ఎలుగుబంటి

ABN , First Publish Date - 2023-02-25T23:51:06+05:30 IST

మందస మండలం బహాడపల్లిలో శనివారం మామిడి భీమారావు తోటకు వెళ్తుండగా ఒక ఎలుగుబంటి పిల్ల కనిపించింది. అది నడవలేని స్థితిలో ఉండటంతో చుట్టుపక్కల తల్లి ఎలుగు ఉందేమోనని భీమారావు సుమారు అరగంట పాటు పరిశీలించాడు.

బుజ్జి ఎలుగుబంటి
ఎలుగు పిల్లను సంరక్షిస్తున్న భీమారావు..

బహడపల్లివాసి సంరక్షణ

హరిపురం, ఫిబ్రవరి 25: మందస మండలం బహాడపల్లిలో శనివారం మామిడి భీమారావు తోటకు వెళ్తుండగా ఒక ఎలుగుబంటి పిల్ల కనిపించింది. అది నడవలేని స్థితిలో ఉండటంతో చుట్టుపక్కల తల్లి ఎలుగు ఉందేమోనని భీమారావు సుమారు అరగంట పాటు పరిశీలించాడు. తర్వాత దానిని ఇంటికి తీసుకువచ్చి.. పాలు పెట్టి సంరక్షించాడు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశాడు. బీట్‌ అధికారులు దుర్గాదేవి, బాబురావు బహాడపల్లికి చేరుకుని ఎలుగుపిల్లను ఆధీనంలోకి తీసుకున్నారు. పశువైద్య అధికారులతో పరీక్షలు నిర్వహించి రట్టి అటవీ ప్రాంతంలో దాన్ని విడిచిపెట్టారు. ఆ ప్రాంతం వైపు స్థానికులు వెళ్లకుండా చూడాలని.. పిల్లల ఎలుగుబంటితో ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అటవీఅఽధికారులు యువతకు సూచించారు. కాగా రెండు నెలల కాలంలో ఎలుగుబంటి పిల్ల కనపడడం.. ఇది రెండోసారి కావటంతో స్థానికులు అందోళన చెందుతున్నారు. రానున్నది జీడి పిక్కల కాలం కావటంతో రోజంతా తోటల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఎలుగులు సంచారం అధికమవటంతో ఎప్పుడు ఏప్రమాదం ముంచుకొస్తుందోనని ఉద్దానం ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-02-25T23:51:08+05:30 IST