మిగిలిన పోస్టులు ఇవ్వండి

ABN , First Publish Date - 2023-05-03T00:44:12+05:30 IST

మిగిలినపోస్టింగులు తమకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ వద్ద మంగళవారం డీఎస్సీ–98 క్వాలిఫైడ్‌ అభ్యర్థు లు ధర్నా నిర్వహించారు.

మిగిలిన పోస్టులు ఇవ్వండి
ధర్నా చేస్తున్న క్వాలిఫైడ్‌ అభ్యర్థులు

ఏలూరు కలెక్టరేట్‌, మే 2: మిగిలినపోస్టింగులు తమకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ వద్ద మంగళవారం డీఎస్సీ–98 క్వాలిఫైడ్‌ అభ్యర్థు లు ధర్నా నిర్వహించారు. క్వాలిఫైడ్‌అభ్యర్థులు మాట్లా డుతూ ఇటీవల ప్రభుత్వం 1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు పోస్టింగులు ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4072 పోస్టులు ఇచ్చారని పశ్చిమగోదావరి జిల్లాలో 386 పోస్టులకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేసి 274 పోస్టులు మాత్రమే భర్తీ చేశారని వివరించారు. భర్తీ చేసిన పోస్టుల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించక పోవడంతో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ వికలాంగులకు పోస్టులు రాలేదన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓసీలకు ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ ప్రకారం 234, బీసీలకు ఐదు, ఎస్సీలకు 34 పోస్టులు మెరిట్‌ ప్రాతిపదికన ఇచ్చారన్నారు. వెరిఫికేషన్‌ చేసిన ప్రతి అభ్యర్ధికి పోస్టు ఇచ్చి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-03T00:44:12+05:30 IST