Congress : సీడబ్ల్యూసీ పునర్వ్యవస్థీకరణ.. గాంధీలతో పాటు సచిన్, థరూర్‌లకు చోటు..

ABN , First Publish Date - 2023-08-20T14:36:54+05:30 IST

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Congress chief Mallikarjun Kharge) ఆదివారం ఆ పార్టీ వర్కింగ్ కమిటీ (CWC)ని పునర్వ్యవస్థీకరించారు. ఈ కమిటీలో స్థానం దక్కించుకున్నవారిలో రాజస్థాన్ యువ నేత సచిన్ పైలట్, కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన శశి థరూర్ కూడా ఉన్నారు.

Congress : సీడబ్ల్యూసీ పునర్వ్యవస్థీకరణ.. గాంధీలతో పాటు సచిన్, థరూర్‌లకు చోటు..

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Congress chief Mallikarjun Kharge) ఆదివారం ఆ పార్టీ వర్కింగ్ కమిటీ (CWC)ని పునర్వ్యవస్థీకరించారు. ఈ కమిటీలో స్థానం దక్కించుకున్నవారిలో రాజస్థాన్ యువ నేత సచిన్ పైలట్, కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన శశి థరూర్ కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు తీసుకునే అత్యున్నత స్థాయి వ్యవస్థ సీడబ్ల్యూసీ.

మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, రాజస్థాన్ యువ నేత సచిన్ పైలట్, ఆ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసిన శశి థరూర్, లోక్ సభలో ఆ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి, కమ్యూనికేషన్ల విభాగం ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్‌లకు సీబ్ల్యూసీలో స్థానం కల్పించారు.

ఇవి కూడా చదవండి :

Rahul Gandhi: లద్దాఖ్‌లో రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు.. అక్కడి ప్రజలు ఏమంటున్నారంటే...

Tungabhadra: నిలకడగా తుంగభద్ర

Updated Date - 2023-08-20T14:36:54+05:30 IST