Congress Leader: సొంత పార్టీ నేతలపై నాగం జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-08-17T18:17:30+05:30 IST
సొంత పార్టీ నేతలపై (Congress leaders) కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి (Congress Leader Nagaram Janardhan Reddy) విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్: సొంత పార్టీ నేతలపై (Congress leaders) కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి (Congress Leader Nagaram Janardhan Reddy) విమర్శలు గుప్పించారు.
"నేను కాంగ్రెస్ పార్టీతోనే ఉంటా. ఎవరూ లేనప్పుడు ఐదేళ్ళుగా నాగర్కర్నూల్లో కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్నా. జూపల్లి, దామోదర్ రెడ్డి ఇప్పుడొచ్చి టికెట్ నాదేనంటున్నారు. దామోదర్ రెడ్డి ఇంకా కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరలేదు. ఎన్నికల్లో గెలిచాక బీఆర్ఎస్లోకి వెళ్ళరని గ్యారంటీ ఏంటి?. రాష్ట్ర రాజకీయాల్లో నేను సీనియర్. కానీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ని కాదు. అందరూ టికెట్ కోసం దరఖాస్తు పెడిదే.. నేనుకు కూడా దరఖాస్తు చేస్తా." అని కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.
కాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై (KCR) కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి (Nagaram Janardhan Reddy) విమర్శలు గుప్పించారు.
"కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. 48వేల కోట్ల కుంభకోణం జరిగింది. తనకు, గాంధీ భవన్కు దూరం పెరగలేదు. అవినీతిపై సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్, కేటీఆర్లదే బాధ్యత. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై తాడో పేడో పేల్చుకోవాలని కాంగ్రెస్ ఎంపీలకు సూచన. కర్ణాటకలో 40 శాతం అవినీతి సరే.. తెలంగాణలో 70శాతం కమిషన్పై మా పార్టీ కాంగ్రెస్ పోరాటం చేయాలి.రాజకీయ నాయకులు కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకుని మౌనంగా ఉంటున్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ చీడ పురుగుగా మారారు." అని నాగం జనార్దనరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
"మెగా కృష్ణారెడ్డి తెలంగాణకు క్యాన్సర్ కంటే ప్రమాదికారిగా మారారు. గాలి జనార్ధనరెడ్డి మాదిరి.. మెగా కృష్ణారెడ్డిని సైతం విడిచిపెట్టను. కాళేశ్వరం డబ్బుతో మెగా కృష్ణారెడ్డి మనీ లాండరింగ్కు పాల్పడ్డారు. కృష్ణా నదీ జలాల అంశంలో తెలంగాణ ప్రమాదంలో పడటానికి సీఎం కేసీఆర్ కారణం. తెలంగాణ నిధుల లూటీని ఆపే బాధ్యత ముఖ్యమంత్రికి లేదా?. ఇంటికో ఉద్యోగం ఇవ్వకుంటే తల నరుక్కుంటానన్న కేసీఆర్ ఎన్నిసార్లు నరుకున్నాడు?. 2004లో సబ్ కాంట్రాక్టర్గా పనిచేసిన కృష్ణారెడ్డి.. దేశంలోనే పెద్ద కాంట్రాక్టర్గా ఎలా ఎదిగారు." అని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్థనరెడ్డి ప్రశ్నించారు.