గౌతాపూర్‌లో రూ.47లక్షలతో అభివృద్ధి పనులు

ABN , First Publish Date - 2023-05-23T23:45:08+05:30 IST

గౌతాపూర్‌ గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి రూ.47లక్షల నిధులు మంజూరు చేశారని సర్పంచ్‌ రాజప్ప తెలిపారు.

గౌతాపూర్‌లో రూ.47లక్షలతో అభివృద్ధి పనులు
పనులను పరిశీలిస్తున్న సర్పంచ్‌ రాజప్ప

తాండూరు రూరల్‌, మే 23: గౌతాపూర్‌ గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి రూ.47లక్షల నిధులు మంజూరు చేశారని సర్పంచ్‌ రాజప్ప తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మంజూరు చేసిన నిధులతో సీసీరోడ్లతో పాటు సీసీ కెమెరాలు, ఐమాస్ట్‌ లైట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరో రూ.5ల క్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. పనులను ఎప్పటికప్పుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. హరిజన్‌ వాడా సమీపంలోని శివాలయం నుంచి జనార్దన్‌రెడ్డి పొలం వరకు డ్రైనేజీ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట వార్డుసభ్యులు మహే్‌షగౌడ్‌, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-05-23T23:45:08+05:30 IST