చేవెళ్ల మండలాభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2023-05-11T00:41:08+05:30 IST
చేవెళ్ల మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు.

చేవెళ్ల, మే 10 : చేవెళ్ల మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఎన్కెపల్లి, ఈర్లపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మిస్తున్న కల్వర్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందన్నారు. నూతన కల్వర్టుల నిర్మాణం రైతులకు, ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, వైస్ ఎంపీపీ శివప్రసాద్, వైస్చైర్మన్ నర్సింలు, మార్కెట్ డైరెక్టర్లు మహేశ్, వెంకటేశ్, సుమలత మంజునాథ్, సర్పంచ్లు రాజశేఖర్, శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ సభ్యులు, వనం లక్ష్మీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.