Share News

MLA SHRAVANISHREE : సభ్యత్వ నమోదులో టాప్‌లో నిలుద్దాం

ABN , Publish Date - Oct 22 , 2024 | 12:23 AM

తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన నియోజకవర్గాన్ని పార్టీ సభ్యత్వ నమోదులో జిల్లాలోనే టాప్‌లో నిలపడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పిలుపునిచ్చారు. అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమ వారం ఆమె పార్టీ బూత, క్లస్టర్‌, యానిట్‌, ఇనచార్జిలు, కార్యకర్తలతో సభ్యత్వ నమోదుపై అవగహన సదస్సు నిర్వహించారు.

MLA SHRAVANISHREE : సభ్యత్వ నమోదులో టాప్‌లో నిలుద్దాం
MLA speaking in the meeting

ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ

శింగనమల, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన నియోజకవర్గాన్ని పార్టీ సభ్యత్వ నమోదులో జిల్లాలోనే టాప్‌లో నిలపడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పిలుపునిచ్చారు. అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమ వారం ఆమె పార్టీ బూత, క్లస్టర్‌, యానిట్‌, ఇనచార్జిలు, కార్యకర్తలతో సభ్యత్వ నమోదుపై అవగహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిఽథులుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌, ద్విసభ్యకమిటీ సభ్యుడు ముంటి మడుగు కేశవరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రామంలిగారెడ్డి హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... టీడీపీకి కార్యకర్తలే బలం అని, సభ్యత్వ నమోదు చేసిన ప్రతి కార్యకర్తకు రూ.5లక్షలు బీమా కల్పించి సీఎం చంద్ర బాబు అండగా నిలిచారని తెలిపారు. నియోజకవర్గంలోని నాయకులు, కా ర్యకర్తలు సభ్యత్వ నమోదులో ముందుండి పార్టీని బలోపేతం చేయాలని అ న్నారు. వెంకటశివుడుయాదవ్‌ మాట్లాడుతూ... సభ్వత్వ నమోదు కార్యక్రమా న్ని పండుగగా జరుపుకుంటామని, ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులు పోటీ పడి సభ్వత్వాలు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుయవత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు, జిల్లా నాయకులు ఆలం వెంకట నరసానాయుడు, పర్వతనేని శ్రీధర్‌బాబు, పసపల శ్రీరామిరెడ్డి , షాలిని, సుదర్శననాయుడు, మండల కన్వీనర్‌లు ఆదినారాయణ, ఆశోక్‌ , పాండు, రామాంజినేయులు, బాల రంగయ్య, ఎర్రినాగప్ప, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 22 , 2024 | 12:23 AM