ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chittoor: పుంగనూరు బాలిక హత్య కేసు.. ముగ్గురి అరెస్టు.. సంచలన విషయాలు వెల్లడి..

ABN, Publish Date - Oct 06 , 2024 | 03:07 PM

రాష్ట్రవ్యాప్తంగా ఘటన సంచలనంగా మారడంతో సీరియస్ అయిన ఏపీ ప్రభుత్వం నిందితులను పట్టుకోవాల్సిందిగా చిత్తూరు ఎస్పీ మణికంఠను ఆదేశించింది. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు తాజాగా ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన బాలిక ఆస్పియా హత్య కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు వెల్లడించారు. పుంగనూరులో సెప్టెంబర్ 29న ట్యూషన్‌కు వెళ్లి ఇంటికి వచ్చిన ఆస్పియా(7) ఆ తర్వాత అదృశ్యమైంది. కుటుంబసభ్యులు ఎంత వేతికినా ప్రయోజనం లేకుండా పోయింది. మూడ్రోజుల తర్వాత పుంగనూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో డెడ్ బాడీ లభించడంతో హత్య కేసు సంచలనంగా మారింది.


రాష్ట్రవ్యాప్తంగా ఘటన సంచలనంగా మారడంతో సీరియస్ అయిన ఏపీ ప్రభుత్వం నిందితులను పట్టుకోవాల్సిందిగా చిత్తూరు ఎస్పీ మణికంఠను ఆదేశించింది. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు తాజాగా ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సంచలన విషయాలు వెల్లడించారు. నగదు లావాదేవీలే బాలిక హత్యకు కారణంటూ పోలీసులు తేల్చారు. బాలిక తండ్రి అజ్మతుల్లా నడుపుతున్న ఫైనాన్స్ వ్యాపారంలో నెలకొన్న లావాదేవీల వివాదమే బాలికను హత్య చేయడానికి దారి తీశాయని ఎస్పీ వెల్లడించారు. ఓ మహిళ సహా మెుత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.


ప్రచారం జరుగుతున్నట్లుగా చిన్నారిపై అత్యాచారం జరగలేదని ఎస్పీ మణికంఠ తేల్చి చెప్పారు. ఆ విషయం పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైందని ఆయన తెలిపారు. గత నెల 29న సాయంత్రం బుర్కా వేసుకుని వచ్చిన ఓ మహిళ బాలికకు చాక్లెట్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్లిపోయిందని, అనంతరం చిన్నారి నోరు, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి చంపేశారని ఎస్పీ తెలిపారు. అనంతరం ఆస్తీయా మృతదేహాన్ని నిందితులు ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో పడేసినట్లు విచారణలో తేలిందని ఎస్పీ మణికంఠ వెల్లడించారు.


ఆస్పియా అదృశ్యమైన అదే రోజు సాయంత్రం అంటే సెప్టెంబర్ 29న బాధిత కుటుంబం పుంగనూరు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినట్లు ఎప్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఘటనపై వెంటనే అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మెుత్తం 12 టీమ్స్‌ను ఏర్పాటు చేసి చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అయితే అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ఆస్పియా మృతదేహాన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో గుర్తించినట్లు ఎస్పీ వెల్లడించారు. హత్య జరిగిందని తెలిసిన వెంటనే పోలీసులను అలర్ట్ చేశామని, అన్ని కోణాల్లో విచారణ చేపట్టి నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Kesineni Sivanath: తిరువూరులో కొన్ని దురదృష్టకరమైన పరిణామాలు.. ఎంపీ కేశినేని శివనాథ్ కీలక వ్యాఖ్యలు

CH baburao: వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం

Updated Date - Oct 06 , 2024 | 04:22 PM