AP Politics: జగన్ కొత్త నాటకం.. వాయిస్ మెసేజ్తో బీద అరుపులు..!
ABN, Publish Date - Mar 21 , 2024 | 07:24 PM
Andhra Pradesh Elections 2024: ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది.. వైసీపీ(YSRCP) నాయకులు రోజుకొక డ్రామా క్రియేట్ చేస్తున్నారు. ఎన్డీయే(NDA) కూటమి దెబ్బకు ఓటమి భయంతో అల్లాడిపోతున్న వైసీపీ వర్గం.. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. తాజాగా సీఎం జగనే(CM J agan) నేరుగా ఎంట్రీ ఇచ్చారు. ప్రజలను ఏమార్చేందుకు బీద అరుపులు అరుస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ జగన్ వాయిస్తో మెసేజ్లు పంపుతున్నారు.
Andhra Pradesh Elections 2024: ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది.. వైసీపీ(YSRCP) నాయకులు రోజుకొక డ్రామా క్రియేట్ చేస్తున్నారు. ఎన్డీయే(NDA) కూటమి దెబ్బకు ఓటమి భయంతో అల్లాడిపోతున్న వైసీపీ వర్గం.. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. తాజాగా సీఎం జగనే(CM J agan) నేరుగా ఎంట్రీ ఇచ్చారు. ప్రజలను ఏమార్చేందుకు బీద అరుపులు అరుస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ జగన్ వాయిస్తో మెసేజ్లు పంపుతున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి చాలా మంది ప్రజల మొబైల్ ఫోన్లకు ఈ వాయిస్ మెసేజ్లు వస్తున్నాయి. అవి విని ప్రజలు షాక్ అవుతున్నారు. ఇదో కొత్త నాటకం మొదలు పెట్టాడా? అంటూ ఫైర్ అవుతున్నారు జనాలు.
వాయిస్ మెసేజ్లో ఏముందంటే..
తనకు చంద్రబాబు లాగా 10 మంది సినిమా నటులు స్టార్ కాంపెయినర్స్ లేరని, మీడియా అండ లేదని బీద అరుపులు అరుస్తున్నారు సీఎం జగన్. ఆకాశంలో నక్షత్రాల్లా మీరే స్టార్ కాంపెయినర్స్ అంటూ ప్రజలను మరోసారి బురిడీ కొట్టించే డైలాగ్స్ వదిలారు. బిడ్డ, అన్న అంటూ తనకు తోడుగా రావాలని ప్రజలను వేడుకున్నారు జగన్. కాగా, ఈ మెసేజ్లు వైరల్ అవడంతో.. విపక్ష నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. సీఎం జగన్ పంపిన ఈ సందేశాలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తాయని, దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాల్సిందేనని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై ఎన్నికలకు కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు టీడీపీ నేతలు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Mar 21 , 2024 | 07:24 PM