ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: నా..నా... అంటూనే ఆ వర్గాలపై వరుస దాడులు.. లోకేష్ ఫైర్

ABN, Publish Date - Apr 06 , 2024 | 12:00 PM

Andhrapradesh: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలపై జరుగుతున్న వరుస దాడులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఓ వైపు వారిని పొగుడుతూనే.. మరోవైపు వైపీపీ మూకలు ఆయా వర్గాల వారిపై దాడి చేయడం హేయనీయమన్నారు. ‘‘నా..నా...అంటూనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై వరుస దాడులు!. నోటితో పొగిడి.. నొసటితో వెక్కిరించినట్లుగా ఉండి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి యవ్వారం’’ అని లోకేష్ మండిపడ్డారు.

అమరావతి, ఏప్రిల్ 6: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలపై జరుగుతున్న వరుస దాడులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara lokesh) స్పందించారు. ఓ వైపు వారిని పొగుడుతూనే.. మరోవైపు వైపీపీ (YSRCP) మూకలు ఆయా వర్గాల వారిపై దాడి చేయడం హేయనీయమన్నారు. ‘‘నా..నా...అంటూనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై వరుస దాడులు!. నోటితో పొగిడి.. నొసటితో వెక్కిరించినట్లుగా ఉండి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (CM Jagan) గారి యవ్వారం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ జగన్ బహిరంగ వేదికలపై ప్రేమ కురిపిస్తుంటే... క్షేత్రస్థాయిలో మాత్రం వైసీపీ మూకలు ప్రతిరోజూ ఆయావర్గాలపై దాడులకు తెగబడుతూ అణచివేత చర్యలకు పాల్పడుతున్నాయి’’ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Alert: ఎన్నికల వేళ మరో కుట్రకు తెరలేపుతున్న చైనా.. మైక్రోసాఫ్ట్ హెచ్చరిక


పెండ్లిమర్రులో జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి అనుచరులు శ్రీనివాసులు అనే బిసి యువకుడ్ని హత్యచేసి 24గంటలు కూడా గడవకముందే. తాజాగా నందికొట్కూరు పట్టణంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరుడు శ్రీనివాసరెడ్డి.. ఓ ముస్లిం మహిళపట్ల అవమానకరంగా ప్రవర్శించారని మండిపడ్డారు. నమాజ్‌కు వెళ్లివస్తున్న ముస్లిం మహిళను బురకా తొలగించి తీవ్రంగా అవమానించడమేగాక, అదేమని ప్రశ్నించిన నేరానికి ఆమె భర్త, కుమారుడిపై చెప్పుతో దాడికి తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారమదంతో విర్రవీగుతున్న జగన్ అండ్ కో కు మరో 37 రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంతా కలసి ఘోరీ కట్టడం ఖాయమని లోకేష్ వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి..

మాస్టర్ ప్లాన్.. పాక్‌ ఉగ్రవాదులపై ‘రా’ గురి!

Trending: ధోనీ విజయం వెనక ఆమె.. ఎవరు, ఏం చేస్తున్నారో మీకు తెలుసా..

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 06 , 2024 | 01:32 PM

Advertising
Advertising