ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections 2024: ఈసీ ఎఫెక్ట్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన జగన్ సర్కార్..

ABN, Publish Date - May 05 , 2024 | 09:56 PM

ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో.. రాష్ట్ర డీజీపీ కేవి రాజేంద్రనాథ్ రెడ్డిని(AP DGP Rajendranath Reddy) బదిలీ చేస్తూ జగన్(CM YS Jagan) సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీ పదవి నుంచి ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి(AP CS Jawahar Reddy) ఆదేశించారు.

CM YS Jagan

అమరావతి, మే 05: ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో.. రాష్ట్ర డీజీపీ కేవి రాజేంద్రనాథ్ రెడ్డిని(AP DGP Rajendranath Reddy) బదిలీ చేస్తూ జగన్(CM YS Jagan) సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీ పదవి నుంచి ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి(AP CS Jawahar Reddy) ఆదేశించారు. ఈ మేరకు అధికారిక జీవో నెంబర్ 850ని జారీ చేశారు. వెంటనే మీ తరువాత స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించాలంటూ ఆ జీవోలో పేర్కొన్నారు.

కాగా, ఎన్నికల్లో పక్షపాత వైఖరిని అవలంభిస్తున్నారంటూ విపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు చేశాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఆదివారం సాయంత్రం 6 గంటలకు డీజీపీని బదిలీ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. దీని ప్రకారం సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.


ఏపీ డీజీపీపై ఈసీ వేటు..

ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. ఎన్నికల వేళ విధులు సవ్యంగా నిర్వర్తించడం లేదంటూ ఆయనను బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది. విధుల నుంచి తక్షణమే రిలీవ్ అవ్వాలని ఆదేశించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎలాంటి ఎన్నికల విధులు ఆయనకు అప్పగించొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ స్పష్టం చేసింది. వెంటనే ఆయన కిందిస్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి రిలీవ్ కావాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. సోమవారం ఉదయం 11 గంటల లోపు కొత్త డీజీపీని నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం ముగ్గురు డీజీ ర్యాంకు పేర్లను పంపించాలని ప్రభుత్వానికి సూచించింది.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 05 , 2024 | 10:00 PM

Advertising
Advertising