ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ramanaidu: అందుకే కృష్ణానదీ జలాలపై అంతర్రాష్ట్ర వివాదం

ABN, Publish Date - Jun 15 , 2024 | 06:14 PM

మాజీ సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల కృష్ణా నదీ జలాలపై అంతర్రాష్ట్ర వివాదం తలెత్తిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) అన్నారు.

Nimmala Ramanaidu

అమరావతి: మాజీ సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల కృష్ణా నదీ జలాలపై అంతర్రాష్ట్ర వివాదం తలెత్తిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) అన్నారు. పోలవరం ప్రాజెక్టును జగన్ విధ్వంసం చేశాడని తాము చెప్పటం కాదు.... నీతి ఆయోగ్ కమిటీనే ధ్రువీకరించిందని చెప్పారు. తనకు కీలక శాఖ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ శాఖ కేటాయింపులో సహకరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.


వ్యవస్థలు అన్నింటితో పాటు అన్ని రంగాలను జగన్ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు కలల ప్రాజెక్టులను పూర్తి చేసి లక్ష్యం నెరవేర్చేలా పని చేస్తానని స్పష్టం చేశారు. జలవనరుల శాఖను సమర్థంగా నిర్వర్తించడం అంటే రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునే అవకాశమేనని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టులో నీరు ఏ మేరకు లభ్యత ఉందనే అంశంపై అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నానని అన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు దుయ్యబట్టారు.


కనీసం కొన్ని ప్రాజెక్టులకు ఉండే లాకుల గేట్లకు గ్రీస్ పెట్టిన దాఖలాలు కూడా లేవన్నారు. ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా గాడిలో పడే విధంగా తీసుకొస్తానని ఉద్ఘాటించారు. పోలవరం ప్రాజెక్టు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌ను చంద్రబాబు ముందు సందర్శిస్తారని వెల్లడించారు. అలాంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి కోల్పోవడంతో పాటు ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి ఏపీకి తీరని ద్రోహం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు.


వైసీపీ ప్రభుత్వంలో కనీసం బడ్జెట్‌లో ఇరిగేషన్‌కు కేటాయించిన డబ్బులు కూడా ఖర్చు పెట్టలేదని మండిపడ్డారు. అవినీతే పరమావధిగా జలవనరుల శాఖను వైసీపీ పాలకులు దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఆవులపల్లి ప్రాజెక్టులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపాలు అన్నీ ఇన్నీ కాదని.. వాటిని బయటకు తీసుకొస్తామని చెప్పారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని మంత్రి నిమ్మల రామానాయుడు వార్నింగ్ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

Chandrababu: ప్రజావేదికను అలానే ఉంచుతాం.. ఎందుకంటే..?

Pawan Kalyan: అడవుల వినాశనానికి పాల్పడితే కటకటాల వెనక్కు వెళ్లాల్సిందే..: పవన్ కళ్యాణ్

Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు

AP Politics: ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటారా.. అహంకారంతో ముందుకెళ్తారా..!

AP Politics: పాలనలో సంస్కరణలకు శ్రీకారం.. గతానికి.. ప్రస్తుతానికి స్పష్టమైన తేడా..

Actor Suman: కూటమి ప్రభుత్వం ఏర్పాటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుమన్

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 15 , 2024 | 06:34 PM

Advertising
Advertising