Share News

Minister Ravindra: నాసిరకం మద్యంతో ప్రాణాలు తీసిన ఏ ఒక్కరినీ వదలను: మంత్రి కొల్లు రవీంద్ర

ABN , Publish Date - Jun 15 , 2024 | 10:41 AM

నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) అన్నారు. నేరానికి పాల్పడిన ప్రతి ఒక్కరికీ చట్ట పరిధిలో శిక్షపడేలా చేస్తామన్నారు.

Minister Ravindra: నాసిరకం మద్యంతో ప్రాణాలు తీసిన ఏ ఒక్కరినీ వదలను: మంత్రి కొల్లు రవీంద్ర
AP Minister Kollu Ravindra

మచిలీపట్నం: నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) అన్నారు. నేరానికి పాల్పడిన ప్రతి ఒక్కరికీ చట్ట పరిధిలో శిక్షపడేలా చేస్తామన్నారు. మద్యం ధరలను అందుబాటులోకి తీసుకొస్తామని, నాసిరకం బ్రాండ్లను బ్యాన్ చేస్తామని తెలిపారు. వైసీపీ హయాంలో ఖనిజ సంపద దోచుకున్న పాలకులపై చర్యలుంటాయని హెచ్చరించారు.

AP Govt: స్పందన కార్యక్రమం పేరును పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్‌గా మారుస్తూ ఉత్తర్వులు..


గంజాయి లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. గంజాయి అరికట్టే విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆయన మచిలీపట్నం వచ్చారు. ప్రజలు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకలు పెద్దఎత్తున ఆయనకు ఘనస్వాగతం పలికి భారీ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి 3గంటల వరకూ సాగిన ర్యాలీలో మంత్రి రవీంద్రకు నీరాజనాలు పలికారు.

ఇవి కూడా చదవండి:

Minister Payyavula: మాజీ మంత్రి యనమలను కలిసిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్..

Kumaraswamy: తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న కేంద్ర మంత్రి కుమారస్వామి..

Updated Date - Jun 15 , 2024 | 10:41 AM