ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Buddha Venkanna: వల్లభనేని వంశీ ఎక్కడ కనిపించినా పోలీసులకు పట్టించండి..

ABN, Publish Date - Aug 04 , 2024 | 12:41 PM

వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత బద్దా వెంకన్న(Badda Venkanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉందనే అహంకారంతో అప్పుడు అడ్డగోలుగా మాట్లాడారని, ఇంట్లో ఉన్న మహిళలను కూడా వదలకుండా బూతులు తిట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

TDP leader Badda Venkanna

విజయవాడ: వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత బద్దా వెంకన్న(Badda Venkanna) సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉందనే అహంకారంతో అప్పుడు అడ్డగోలుగా మాట్లాడారని, ఇంట్లో ఉన్న మహిళలను కూడా వదలకుండా బూతులు తిట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించాక.. వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) వంటి వాళ్లు ఊరొదలి పారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు.


ఈ సందర్భంగా టీడీపీ నేత బుద్దా వెంకన్న మాట్లాడుతూ.."వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ నోటి దూలతో నీచంగా మాట్లాడారు. ఆనాడు చంద్రబాబు, లోకేశ్‌ను దూషించి గన్నవరం టీడీపీ కార్యాలయంపై వంశీ దాడి చేయించారు. రాజకీయభిక్ష పెట్టిన పార్టీ, నాయకుడిపైనే ఆయన విషం చిమ్మారు. ఇవాళ అధికారం పోగానే దాక్కుని బతుకుతున్నారు. వంశీ క్షమాభిక్షకు కూడా అర్హుడు కాదు.


వంశీ నమ్మక ద్రోహి, అతనిపై ఎవ్వరూ జాలిపడొద్దు. టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన అనేక కుట్రలు చేశారు. వైఎస్ చనిపోతే వంశీ పార్టీ చేసుకున్నారు. అతను చేసిన తప్పులకు శిక్ష పడాల్సిందే. ఆయనికి బిల్డప్ ఎక్కువ విషయం తక్కువ. కిరాయి మనుషులను అడ్డుగా పెట్టుకుని బతుకుతున్నారు. వంశీ చాలా పిరికి వ్యక్తి, అందుకే పారిపోయారు. అతను ఎక్కడ కనిపించినా పోలీసులకు అప్పగించాలని ప్రజల్ని కోరుతున్నా" అని చెప్పారు.


ప్రజలు కొట్టిన దెబ్బకు జగన్‌ బిత్తర చూపులు..

వైసీపీ నేతలు కొడాలి నాని, పేర్ని నానిలు ఏమాత్రం సిగ్గు లేకుండా ఇప్పుడు చిలకపలుకులు పలుకుతున్నారని బుద్దా వెంకన్న అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మీరంతా ఎలా మాట్లాడారో గుర్తు లేదా?, మమ్మల్ని అలా తిడుతుంటే వద్దని ఏనాడైనా జగన్ చెప్పారా? అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు రంకెలు వేసిన వాళ్లంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్లారో చెప్పాలంటూ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు.


సింహం సింగిల్‌గా వస్తుందన్న జగన్ రెడ్డి ఇప్పుడు గజనీ రెడ్డిగా మారారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజలు కొట్టిన దెబ్బకు మాజీ ముఖ్యమంత్రి జగన్ బిత్తర చూపులు చూస్తున్నారని అన్నారు. న్యాయం చేయమని కోరిన చెల్లెళ్లను జగన్ బూతులు తిట్టిస్తున్నారు. ఇలాంటి విలువలు లేని వారంతా వైసీపీలోనే ఉన్నారంటూ టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు.

Updated Date - Aug 04 , 2024 | 01:15 PM

Advertising
Advertising
<