ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: జనసేన ఎదుగుదలను డీఎస్ ఆకాంక్షించారు

ABN, Publish Date - Jun 29 , 2024 | 04:21 PM

మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (D Srinivas) మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంతాపం వ్యక్తం చేశారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Pawan Kalyan

అమరావతి: మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (D Srinivas) మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంతాపం వ్యక్తం చేశారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. .శ్రీనివాస్ మరణం బాధాకరమన్నారు. జనసేన పార్టీ ఎదుగుదలను డీఎస్ ఆకాంక్షించారని గుర్తుచేసుకున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న డీఎస్ ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి, ఉన్నత విద్య శాఖల మంత్రిగా సేవలందించారని చెప్పారు.


తెలంగాణ ఉద్యమ సమయంలో బలంగా తన వాదం వినిపించారని అన్నారు. వారిని రెండు మూడు సందర్భాల్లో కలిశానని గుర్తుచేసుకున్నారు. తన రాజకీయ ప్రయాణం, అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నారని తెలిపారు.. డీఎస్ కుమారుడు, లోక్ సభ సభ్యులు ధర్మపురి అరవింద్, ఇతర కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - Jun 29 , 2024 | 04:29 PM

Advertising
Advertising