Share News

Duvvada Srinivas: దువ్వాడ శ్రీను, వాణిపై కేసు నమోదు..!

ABN , Publish Date - Aug 10 , 2024 | 08:28 PM

Duvvada Srinivas: దువ్వాడ కుటుంబ వివాదం ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు బిగ్ డిస్కషన్‌గా నడుస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇల్లీగల్ అఫైర్‌పై ఆయన భార్య, పిల్లలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగానే..

Duvvada Srinivas: దువ్వాడ శ్రీను, వాణిపై కేసు నమోదు..!
Duvvada Srinivas

Duvvada Srinivas: దువ్వాడ కుటుంబ వివాదం ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు బిగ్ డిస్కషన్‌గా నడుస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇల్లీగల్ అఫైర్‌పై ఆయన భార్య, పిల్లలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగానే.. వ్యవహారం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. తాజాగా దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య, పిల్లలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దువ్వాడ శ్రీను, దువ్వాడ వాణి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇరువు ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు.


దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు దువ్వాడ వాణి, కూతురు హైందవి, మరికొందరిపై 329(3), 324(4), 351(2)R/w 3(5) సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక వాణి ఫిర్యాదు మేరకు దువ్వాడ శ్రీనివాస్, ఆయన సోదరుడు దువ్వాడ శ్రీదర్‌పై 329(4), 351(2), 126(2) R/w 3(5) సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు.


కాగా, దువ్వాడ శ్రీనివాస్ తమను కాదని వేరే మహిళతో ఉంటున్నాడని ఆయన భార్య వాణి, కూతురు హైందవి ఆరోపించారు. ఇదే అంశంపై వారు శ్రీనివాస్ ఇంటి ముందు నిరసనకు దిగారు. ఈ క్రమంలో శ్రీనివాస్ ఇంటి వద్ద పెద్ద రచ్చ జరిగింది. మాధురి అనే మహిళతో దువ్వాడ శ్రీనివాస్ అక్రమం సంబంధం పెట్టుకున్నాడని, తమను ఇంటికి కూడా రానివ్వడం లేదని ఆయన భార్య వాణి, కూతురు ఆరోపించారు. మరోవైపు.. భార్య, పిల్లలు తనను వదిలేశారని.. అందుకే వేరే మహిళతో ఉంటున్నట్లు దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. ఇలా ఈ వివాదం భగ్గమంటూనే ఉంది. ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగిన ఈ వ్యవహారంలో.. ముందు ముందు ఇంకెన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాలి.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Aug 10 , 2024 | 08:28 PM