Share News

Pune: భారతీయ విశ్వాసాలను తగ్గించేందుకు బ్రిటిషర్ల ప్రయత్నం: ఆర్ఎస్ఎస్ చీఫ్

ABN , Publish Date - Jul 21 , 2024 | 07:36 AM

బ్రిటిషర్లు 1857 తరువాత భారతీయ సంప్రదాయాలు, పూర్వీకులపై ఉన్న విశ్వాసాన్ని తగ్గించేందుకు క్రమపద్ధతిలో ప్రయత్నాలు చేశారని ఆర్‌ఎస్‌ఎస్(RSS) చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagwat) శనివారం పేర్కొన్నారు.

Pune: భారతీయ విశ్వాసాలను తగ్గించేందుకు బ్రిటిషర్ల ప్రయత్నం: ఆర్ఎస్ఎస్ చీఫ్

పుణె: బ్రిటిషర్లు 1857 తరువాత భారతీయ సంప్రదాయాలు, పూర్వీకులపై ఉన్న విశ్వాసాన్ని తగ్గించేందుకు క్రమపద్ధతిలో ప్రయత్నాలు చేశారని ఆర్‌ఎస్‌ఎస్(RSS) చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagwat) శనివారం పేర్కొన్నారు.

గుడ్డి విశ్వాసం ఉంటుంది కానీ విశ్వాసం ఎప్పుడూ గుడ్డిది కాదని భగవత్ అన్నారు. పుణెలో ప్రముఖ రచయిత జీబీ డెగ్లూర్కర్ పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడారు. కొన్ని ఆచారాలు అనుసరించాల్సిన నమ్మకాలు అని స్పష్టం చేశారు. అయితే వీటిల్లో కాలానుగుణంగా కొన్ని మార్పులు చేస్తే సరిపోతుందని చెప్పారు.


"బ్రిటీషర్లు1857 తర్వాత (బ్రిటీష్ పాలకులు అధికారికంగా భారతదేశాన్ని పాలిస్తున్నప్పుడు) మన మనసులో నుంచి విశ్వాసాన్ని తొలగించడానికి క్రమపద్ధతిలో ప్రయత్నాలు చేశారు. సంప్రదాయాలు, పూర్వీకులపై మనకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బకొట్టాలని చూశారు.

భారత్‌లో విగ్రహారాధన ఉంది. దాని వెనక సైన్స్ ఉంది. మన దేశంలో విగ్రహాలు భావోద్వేగాలతో కూడుకున్నాయి. ఇలాంటివి ప్రపంచంలో ఎక్కడా కనిపించవు. ఆకార స్థితి నుంచి నిరాకార స్థితికి వెళ్లడానికి దృష్టి ఉండాలి. విశ్వాసం ఉన్నవారు ఆ దృష్టిని కలిగి ఉంటారు" అని మోహన్ భగవత్ పేర్కొన్నారు.

For Latest News and National News click here

Updated Date - Jul 21 , 2024 | 07:36 AM