Home » Mohan Bhagwat
దేశాన్ని పాలించిన సామ్రాట్టులు, మహారాజులను గుర్తుపెట్టుకోరని, తండ్రి మాట నిలబెట్టేందుకు 14 ఏళ్లు ఆజ్ఞాతవాసం అరణ్యవాసం చేసిన రాజును, తన సోదరుడి పాదరక్షలు తీసుకుని అతని తిరిగి రాగానే రాజ్యాన్ని అప్పగించిన వ్యక్తిని గుర్తుంచుకుంటుందని మోహన్ భాగవత్ అన్నారు.
ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ భగ్గుమంది. మన దేశానికి ‘నిజమైన స్వాతంత్య్రం’ ఆయోధ్యలో రామ మందిరం ప్రారంభమైన రోజే వచ్చిందని భాగవత్ పేర్కొన్నారు.
మసీదు-ఆలయాల వివాదాలకు సంబంధించి ఆర్ఎ్సఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై ఆ సంస్థ అనుబంధ పత్రిక ‘ది ఆర్గనైజర్’ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
అయోధ్యలో రామాలయ నిర్మాణం తర్వాత ఇదే తరహా వివాదాలు రేకెత్తించడం ద్వారా తాముకూడా హిందూ నాయకులు కావచ్చనే అభిప్రాయంతో కొందరు ఉన్నారని, ఇది తమకు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని మోహన్ భాగవత్ అన్నారు.
సంతానోత్పత్తి రేటు ఏ దేశంలోనైనా 2.1 శాతానికి మించి ఉండాలని ఎలన్ మస్క్ తెలిపారు. ఇదే విషయాన్ని కొన్ని రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగపూర్లో ఆ సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రస్తావించారు. భారతదేశంలో సంతానోత్పత్తి తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ జనాభా శాస్త్రం ప్రకారం సంతానోత్పత్తి రేటు 2.1 శాతానికి మించి ఉండాలని సూచించారు. ఈ అంశం దేశంలో తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది. ఓవైసీతో పాటు కాంగ్రెస్కు చెందిన కొందరు నేతలు..
జనాభా తగ్గడంతో పలు సమాజాలు, భాషలు ఇప్పటికే ఉనికి కోల్పోయాయని మోహన్ భగవత్ హెచ్చరించారు. 1998 లేదా 2002లో భారత జనాభా విధానం రూపొందిందని, 2.1 శాతానికి కంటే సంతోనోత్పత్తి పడిపోకుండా చూడాల్సిన అవసరాన్ని కూడా గుర్తించిందని చెప్పారు.
టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెట్జీ టాటాకు రతన్ టాటా ముని మనవడు. 1937, డిసెంబరు 28న ముంబైలో రతన్ టాటా జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సూని టాటా, నావల్ టాటా. అయితే రతన్ టాటా పదేళ్ల వయస్సులో తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో తన నాయనమ్మ నవాజ్బాయ్ టాటా వద్ద రతన్ పెరిగారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో విద్యనభ్యసించారు. అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు.
జైలు నుంచి బెయిలుపై విడుదలై ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కు 5 సూటి ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పాలని కోరారు.
మనం దేవుళ్లమో.. కాదో ప్రజలే నిర్ణయిస్తారని ఆర్ఎ్సఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ భద్రతను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరింత పటిష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న జడ్ ప్లస్ కేటగిరి భద్రతను అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్కు పెంచింది. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమానమైన భద్రత మోహన్ భగవత్కు లభిస్తుంది.