Share News

రేపు దేశవ్యాప్తంగా వైద్యుల నిరాహార దీక్ష

ABN , Publish Date - Oct 14 , 2024 | 06:21 AM

కోల్‌కతాలో అత్యాచారానికి, హత్యకు గురయిన ట్రైనీ డాక్టరుకు న్యాయం చేయాలని డిమాండు చేస్తూ మంగళవారం దేశ వ్యాప్తంగా వైద్యులు నిరాహార దీక్ష చేయనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం ఇండియన్‌

రేపు దేశవ్యాప్తంగా వైద్యుల నిరాహార దీక్ష

న్యూఢిల్లీ, అక్టోబరు 13: కోల్‌కతాలో అత్యాచారానికి, హత్యకు గురయిన ట్రైనీ డాక్టరుకు న్యాయం చేయాలని డిమాండు చేస్తూ మంగళవారం దేశ వ్యాప్తంగా వైద్యులు నిరాహార దీక్ష చేయనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ప్రకటించింది. ఇదే విషయమై కోల్‌కతాలోని ఆర్‌.జి.కర్‌ వైద్యకళాశాల వద్ద జూనియర్‌ డాక్టర్లు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష తొమ్మిదో రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఐఎంఏ ఈ ప్రకటన చేసింది. ఇదిలా ఉండగా, ఆందోళనకారుల డిమాండ్లు సోమవారంలోగా పరిష్కరించకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని బెంగాల్‌లోని కల్యాణి జేఎన్‌ఎం ఆస్పత్రికి చెందిన 77 మంది సీనియర్‌ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Updated Date - Oct 14 , 2024 | 06:21 AM