Kanimozhi: ‘నిర్బంధ హిందీ’పై మాట మార్చిన పవన్:కనిమొళి
ABN , Publish Date - Mar 16 , 2025 | 03:12 AM
2017లో ఆంధ్రజ్యోతి పత్రికలో చలసాని నరేంద్ర ‘హిందీ గో బ్యాక్’ పేరుతో రాసిన వ్యాస క్లిప్పింగును సామాజిక మాధ్యమాల్లో జత చేసి, ‘ఉత్తర భారత రాజకీయ నాయకులు భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకోవాలి, గౌరవించాలి’ అని పవన్ కల్యాణ్ అప్పట్లో ఎక్స్లో పెట్టిన పోస్ట్ను కనిమొళి గుర్తు చేశారు.

చెన్నై, మార్చి 15(ఆంధ్రజ్యోతి): జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్న డీఎంకే నేతలపై పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ సీనియర్ నాయకురాలు కనిమొళి కౌంటర్ ఇచ్చారు. 2017లో ఆంధ్రజ్యోతి పత్రికలో చలసాని నరేంద్ర ‘హిందీ గో బ్యాక్’ పేరుతో రాసిన వ్యాస క్లిప్పింగును సామాజిక మాధ్యమాల్లో జత చేసి, ‘ఉత్తర భారత రాజకీయ నాయకులు భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకోవాలి, గౌరవించాలి’ అని పవన్ కల్యాణ్ అప్పట్లో ఎక్స్లో పెట్టిన పోస్ట్ను కనిమొళి గుర్తు చేశారు. బీజేపీకి మద్దతు ఇవ్వక ముందు నిర్బంధ హిందీని వ్యతిరేకించి, బీజేపీతో చేతులు కలిపిన తర్వాత నిర్బంధ హిందీకి మద్దతుగా మాట్లాడుతున్నారంటూ కనిమొళి ఆరోపించారు.