ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: గోవాకు వెళ్తున్నారా.. ఈ గుడ్ న్యూస్ మీకోసమే..!

ABN, Publish Date - Jul 06 , 2024 | 04:42 PM

తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణీకులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాలంటే డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో లేదు. కేవలం బస్సు సౌకర్యం మాత్రమే అందుబాటులో ఉంది.

Special Train

తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణీకులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాలంటే డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో లేదు. కేవలం బస్సు సౌకర్యం మాత్రమే అందుబాటులో ఉంది. ఒకవేళ సికింద్రాబాద్‌ నుంచి వాస్కోడగామా(గోవా) వెళ్లాలంటే వారానికి ఒక రైలు 10 బోగీలతో సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి గుంతకల్‌ చేరుకుని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 బోగీలతో కలిపి ఒక నూతన రైలుగా మారి గోవాకువెళ్లేది. ఇది కాకుండా కాచిగూడ - యలహంక మధ్య వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్ళే 4 కోచ్‌లను కలిపేవారు. ఈ 4 కోచ్ లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ - గోవా మధ్య తిరిగే రైలుకు కలిపేవాళ్లు. దీంతో ప్రయాణ సమయం ఎక్కువుగా పట్టేది. మరోవైపు నేరుగా గోవాకు రైలు వేయాలని కేంద్రప్రభుత్వాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. కిషన్ రెడ్డితో పాటు పలువురు చేసిన వినతికి స్పందించిన రైల్వే శాఖ సికింద్రాబాద్- వాస్కోడగామా మధ్య బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంది.

Wife and Husband: మహాతల్లి.. తన జల్సాల కోసం ఏకంగా భర్తనే..


ప్రధానికి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు..

సికింద్రాబాద్-వాస్కోడగామా (గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించడంతో ప్రధాని మోదీ, రైల్వే శాఖమంత్రి అశ్వినీవైష్ణవ్‌లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు హైదరాబాద్‌ చుట్టపక్కల ప్రాంతాల నుంచి ప్రతిరోజు గోవా వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా వీకెండ్స్‌లో అయితే వీరి సంఖ్య మరీ ఎక్కువ. ఈ నేపథ్యంలో కొత్త రైలు సర్వీసు అందుబాటులోకి రావడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్‌-గోవా బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ.. వాస్కోడగామా చేరుకుంటుందని రైల్వేశాఖ వెల్లడించింది.


Rohit: కోట్లలో ఆస్తులు.. ఆడి కారు.. విమానంలో టూర్లు..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 06 , 2024 | 04:42 PM

Advertising
Advertising
<