ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maharashtra Elections: తెగని సీట్ల పంచాయితీ.. ఉద్ధవ్, కాంగ్రెస్ మధ్య ముదురుతున్న వివాదం..

ABN, Publish Date - Oct 18 , 2024 | 05:22 PM

శివసేన(యూబీటీ), ఎన్సీపీ (శరద్) పార్టీలు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో భాగస్వామ్యపక్షాలుగా ఉన్నాయి. నామినేషన్ల పర్వం మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే మూడు పార్టీలు చర్చలు ప్రారంభించాయి. మూడు పార్టీల నుంచి ముగ్గురు కీలక నేతలతో ఓ కమిటీని ఏర్పాటుచేసి, సీట్ల పంపకంపై చర్చించారు. 200కు పైగా సీట్లలో ఏకాభిప్రాయం వచ్చిందని ఎన్సీపీ (శరద్) పార్టీ ప్రకటించినప్పటికీ తాజాగా శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం రానట్లు

Sharad Pawar, Rahul, uddhav thackeray

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 22వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. అదేరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఈనెల 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 20వ తేదీన ఒకే విడతలో 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలో ఇండియా, ఎన్డీయే కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మహారాష్ట్రలో ప్రధాన పార్టీలు కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి. శివసేన(యూబీటీ), ఎన్సీపీ (శరద్) పార్టీలు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో భాగస్వామ్యపక్షాలుగా ఉన్నాయి. నామినేషన్ల పర్వం మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే మూడు పార్టీలు చర్చలు ప్రారంభించాయి. మూడు పార్టీల నుంచి ముగ్గురు కీలక నేతలతో ఓ కమిటీని ఏర్పాటుచేసి, సీట్ల పంపకంపై చర్చించారు. 200కు పైగా సీట్లలో ఏకాభిప్రాయం వచ్చిందని ఎన్సీపీ (శరద్) పార్టీ ప్రకటించినప్పటికీ తాజాగా శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం రానట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్రలో సీట్ల పంపకాలపై నెలకొన్న రాజకీయ గందరగోళంలో శివసేన (యూబీటీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ సీట్ల పంపకంపై నేరుగా కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చించనున్నట్లు ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ తెలిపారు. త్వరలో రాహుల్ గాంధీతో ఈ విషయమై మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


రాహుల్‌తోనే..

మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు సీట్ల పంపకంపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారని, నామినేషన్ల సమయం దగ్గరపడటంతో నేరుగా తాము రాహుల్ గాంధీతోనే మాట్లాడతామని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌తో ఇప్పటికే రౌత్ సీట్ల పంపంకాలపై చర్చించారు. ముంబైలో సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని సీట్ల విషయంలో రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదన్నారు. ఈ విషయమై నేరుగా రాహుల్‌ గాంధీతో మాట్లాడతామన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఒక్కో సీటు గురించి ఢిల్లీ నేతలతో సంప్రదిస్తున్నారని, దీంతో సమయం వృధా అవుతుందని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. శివసేన (యుబిటి), ఎన్సీపీ (శరద్) మధ్య సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయం వచ్చినప్పటికీ కాంగ్రెస్‌తో సీట్ల పంచాయితీ తెగనట్లు కనిపిస్తోంది.


రౌత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్..

రౌత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత నానా పటోలే ఆచితూచి స్పందించారు. ఆయన ఏం చెప్పారో తనకు తెలియదని.. ఈ సమయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదన్నారు. రౌత్ ప్రకటను తాను చూడలేదన్నారు. సీట్ల పంపకాలపై హైకమాండ్ మిత్రపక్షాలతో చర్చిస్తుందన్నారు.


ముంబయి, విదర్భ విషయంలో..

ముంబై, విదర్భ రీజియన్‌ సీట్ల విషయంలో శివసేన (యూబీటీ), కాంగ్రెస్‌ల మధ్య పోరు సాగుతున్నట్లు తెలుస్తోంది. శివసేన విదర్భ ప్రాంతంలో ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో, కాంగ్రెస్ గత ఎన్నికల్లో రెండవ స్థానంలో ఉన్న ముంబైలోని స్థానాలపై దృష్టిపెట్టింది. శివసేన (యూబీటీ) కూడా ముంబైలో ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని ఆశిస్తోంది. ముంబైలో 36 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. కనీసం 20 స్థానాల్లో పోటీ చేయాలని ఉద్దవ్ పార్టీ భావిస్తోంది. శివసేన నాగ్‌పూర్‌, అమరావతిలో ఎక్కువ సీట్లు అడుగుతుండగా.. కాంగ్రెస్ అంగీకరించడం లేనట్లు తెలుస్తోంది. నామినేషన్ల స్వీకరణ సమయం దగ్గరపడుతున్న వేళ సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ ఎలా వ్యవహారిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 18 , 2024 | 05:22 PM