Kutami: పాయకరావుపేట, గాజువాకలో చంద్రబాబు ప్రజాగళం
ABN, Publish Date - Apr 15 , 2024 | 12:42 PM
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో భాగంగా ఆదివారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట, విశాఖ జిల్లా గాజువాకల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. తొలుత పాయకరావుపేటలో జరిగిన ప్రజాగళం సభకు జనం పోటెత్తారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మధ్యాహ్నం నుంచి నక్కపల్లి, కోటవురట్ల, ఎస్.రాయవరం మండలాల నుంచి భారీగా జనం కదలి వచ్చారు. పాయకరావుపేటలో మంగవరం రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద చంద్రబాబునాయుడుకు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి గెడ్డం బుజ్జి, తోట నగేశ్, స్థానిక నేతలు చంద్రబాబుకు పూలబొకేలు అందించి ఘన స్వాగతం పలికారు.
Updated at - Apr 15 , 2024 | 12:42 PM