Share News

Women: మాజీ ప్రియుడితో మళ్లీ కలిసేందుకు యువతి వెరైటీ స్కెచ్.. జ్యోతిష్యుడి ఎంట్రీతో చివరకు ఊహించని ట్విస్ట్..

ABN , Publish Date - Jan 23 , 2024 | 04:16 PM

ఒక్కోసారి ఒకరి బలహీనత ఇంకొకరికి అవకాశంగా మారుతుంటుంది. ఇలాంటి అవకాశాన్ని కొందరు క్యాష్ చేసుకుంటుంటారు. మహిళల విషయంలో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరగడం చూస్తూ ఉంటాం. తాజాగా...

Women: మాజీ ప్రియుడితో మళ్లీ కలిసేందుకు యువతి వెరైటీ స్కెచ్.. జ్యోతిష్యుడి ఎంట్రీతో చివరకు ఊహించని ట్విస్ట్..
ప్రతీకాత్మక చిత్రం

ఒక్కోసారి ఒకరి బలహీనత ఇంకొకరికి అవకాశంగా మారుతుంటుంది. ఇలాంటి అవకాశాన్ని కొందరు క్యాష్ చేసుకుంటుంటారు. మహిళల విషయంలో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరగడం చూస్తూ ఉంటాం. తాజాగా, బెంగళూరుకు చెందిన యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ యువతి తన మాజీ ప్రియుడిని మళ్లీ తన సొంతం చేసుకోవాలని అనుకుంది. చివరకు జ్యోతిష్యుడి ఎంట్రీతో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

బెంగళూరు (Bangalore) పరిధిలోని జలహళ్లి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఉషా రాణి (పేరు మార్చాం) అనే 25 ఏళ్ల యువతి, నరేష్ (పేరు మార్చాం) అనే యువకుడు కొన్నేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. అయితే తర్వాత వివిధ కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. తర్వాత నరేష్ తన పనిలో తాను బిజీ అయిపోయాడు. అయితే ఉషా మాత్ర నరేష్‌ను మర్చిపోలేకపోయింది. నిత్యం అతడి గురించే ఆలోచించేది. ఎలాగైనా మళ్లీ తనకు దగ్గర కావాలని కోరుకుంటూ ఉండేది. అయినా నరేష్ మాత్రం ఆమెకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఈ క్రమంలో ఉషా తీవ్ర మానసిక ఒత్తిడికి (mental stress) గురైంది. ఇలా వుండగా, డిసెంబర్ 9న ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తుండగా అహ్మద్ అనే జ్యోతిష్యుడు పరిచయమయ్యాడు. చేతబడి (black magic) చేసి ఇద్దరినీ కలుపుతానని చెప్పడంతో ఉషా అతన్ని నమ్మింది. పూజల పేరుతో మొదట రూ.501లు అడగడంతో బదిలీ చేసింది.

Viral Video: విమానంలో ఆకతాయి నీచపు పని.. ఎయిర్‌హోస్టెస్‌కు తెలీకుండా వెనుక నుంచి..

ఆ తర్వాత నరేష్, ఉషా ఫొటోలతో పాటూ కుటుంబ సభ్యుల ఫొటోలు కూడా పంపితే పూజలు చేస్తానని చెప్పాడు. అలా పంపిన తర్వాత.. పూజల నిమిత్తం రూ.2.4లక్షలు ఇవ్వాలని చెప్పాడు. ప్రేమికుడిని దగ్గర చేస్తానని హామీ ఇవ్వండంతో ఇష్టం లేకున్నా ఉషా అతడికి నగదును పంపింది. అయితే అంతటితో ఆగని జ్యోతిష్యుడు.. మళ్లీ ఏవేవో కారణాలు చెప్పి రూ.1.7లక్షలు అడిగాడు. అప్పటికే విసిగిపోయిన ఉషా.. తర్వాత నగదు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో జ్యోతిష్యుడు చివరకు బెదిరింపులకు దిగాడు. ఉషా, నరేష్ కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, పరువు తీస్తానని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన ఉషా... జవనరి 10 మళ్లీ రూ.4.1లక్షలు పంపింది. ఇలా దఫాలుగా మొత్తం రూ.8లక్షలకు పైగా నగదు పంపింది. అయితే ఇటీవల ఉషా తల్లిదండ్రులకు అనుమానం వచ్చి.. గట్టిగా నిలదీయడంతో విషయం మొత్తం వెలుగులోకి వచ్చింది. తర్వాత జ్యోతిష్యుడు ఫోన్ స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Viral Video: ఈ ఐడియా ఏదో బాగుందే.. సబ్బు లేకుండానే పాత్రల క్లీనింగ్.. నువ్వు సూపర్ బాసూ...

Updated Date - Jan 23 , 2024 | 04:16 PM