Share News

India vs Bangladesh: ఇండియా, బంగ్లాదేశ్ రెండో టెస్టులో.. టాస్ గెల్చిన టీమిండియా

ABN , Publish Date - Sep 27 , 2024 | 09:54 AM

కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ కాసేపట్లో మొదలు కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీం ఇండియా భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను డ్రాతో ముగించాలని బంగ్లాదేశ్ భావిస్తోంది.

India vs Bangladesh: ఇండియా, బంగ్లాదేశ్ రెండో టెస్టులో.. టాస్ గెల్చిన టీమిండియా
team india vs Bangladesh second Test

టీమిండియా(team india), బంగ్లాదేశ్(bangladesh) మధ్య రెండో టెస్ట్‌కు ముందు గత రాత్రి వర్షం పడటంతో తడి నేల కారణంగా టాస్ ఆలస్యమైంది. అంపైర్లు ఫీల్డ్‌ను పరిశీలించారు. ఇప్పుడు టాస్ 10 గంటలకు నిర్వహించబడుతుంది. ఆట 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ నుంచి భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్న భారత్.. బంగ్లాదేశ్‌పై తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తోంది. ఈ క్రమంలో రెండో చివరి టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు భారత్‌ను బంగ్లాదేశ్ కట్టిడి చేయాలని చూస్తోంది.


టాస్ గెల్చిన టీమిండియా

రెండో టెస్టులో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. టీమ్ ఇండియా జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. చెన్నై ఎర్రమట్టికి బదులు ఇక్కడ కాన్పూర్‌లో నల్లమట్టి ఉంటుంది. బౌన్స్ ఎక్కువగా ఉండదు. ఎర్ర బంకమట్టి పిచ్ ఇతర పిచ్‌ల కంటే తక్కువ నీటిని గ్రహిస్తుంది. నల్ల నేల పిచ్‌లో ఎక్కువ బంకమట్టి ఉన్నప్పటికీ, అది నీటిని బాగా గ్రహిస్తుంది. దీని కారణంగా పిచ్ ఎక్కువ కాలం పగుళ్లు లేకుండా ఉంటుంది. ఇది అసమాన బౌన్స్‌ను సృష్టిస్తుంది, బ్యాట్స్‌మెన్‌లు స్థిరపడటానికి సమయం పడుతుంది.


వర్షం సూచనలు

ఇలాంటి పిచ్‌లపై బ్యాట్స్‌మెన్లు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాన్పూర్‌లో భారత జట్టు ఇప్పటివరకు 23 మ్యాచ్‌లు ఆడగా, అందులో భారత్ 7 గెలువగా, అదే సమయంలో భారత జట్టు 3 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది. Accuweather.com ప్రకారం సెప్టెంబర్ 27న కాన్పూర్‌లో వర్షం పడే అవకాశం ఉంది. ఈ రోజు 92 శాతం వర్షం కురిసే ఛాన్స్ ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనుంది. ఈ సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది. తొలి టెస్టులో భారత జట్టు 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి టెస్టులో అశ్విన్ అద్భుత ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.


ఇవి కూడా చదవండి:

Personal Finance: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీంలో రూ.10 లక్షలు పెడితే.. మీకు వడ్డీనే రూ. 20 లక్షలొస్తుంది తెలుసా..


Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Read More Sports News and Latest Telugu News

Updated Date - Sep 27 , 2024 | 10:18 AM