Lord Kodanda Rama: ఒంటిమిట్ట కోదండరామునికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు
ABN , Publish Date - Apr 11 , 2025 | 10:03 AM
సీతారాముల కల్యాణానికి కడప జిల్లా ఒంటిమిట్ట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శుక్రవారం జరుగనున్న కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆధ్వర్యంలో కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. వేదిక ముందుభాగంలో వీవీఐపీ గ్యాలరీతో పాటు క్యూలైన్లు, ఆలయం వద్ద భారీగా చలువ పందిళ్లు సిద్ధం చేశారు. కల్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.

కడప: దేశంలోనే విభిన్నంగా.. ఒంటిమిట్ట (Ontimitta) కోదండరాముని కళ్యాణం (Kodanda Rama Kalyanam) జరుగుతుంది. శుక్రవారం రాత్రి పండువెన్నెల్లో చంద్రుడు తిలకిస్తుండగా.. ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం జరగనుంది. శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. ఆయన పరిణయ మహోత్సవాలు అయోధ్యలోనైనా.. భద్రాద్రిలోనైనా.. ఏ ఇతర రామాలయ క్షేత్రాలలోనైనా నవమి నాడే అభిజిత్ లగ్నంలో పగటిపూట మాత్రమే జరపడం ఆనవాయితీ. అలాగే అన్ని ఆలయాల్లో చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి ఉత్సవాలు మొదలై నవమి నాటి కల్యాణంతో ముగుస్తాయి. అయితే అందుకు భిన్నంగా శ్రీరామచంద్రుడు, సీతమ్మను పరిణయమాడే మహత్తర ఉత్సవాన్ని చైత్ర శుద్ధ చతుర్ధశి నాటి రాత్రివేళ పండువెన్నెల్లో నిర్వహించడం ఏకశిలానగరి ఒంటిమిట్టలో మాత్రమే ప్రత్యేకం. కనుల విందుగా కోదండరాముని కళ్యాణం జరగనుంది. ఒంటిమిట్టకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణ భారత దేశం నుండి భక్తులు తరలివస్తున్నారు. ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేసింది.
Also Read..: తహవ్వుర్ రాణాకు 18 రోజుల ఎన్ఐఏ కస్టడీ
కాగా సీతారాముల కల్యాణానికి కడప జిల్లా ఒంటిమిట్ట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శుక్రవారం జరుగనున్న కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ (TTD) ఆధ్వర్యంలో కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. వేదిక ముందుభాగంలో వీవీఐపీ గ్యాలరీతో పాటు క్యూలైన్లు, ఆలయం వద్ద భారీగా చలువ పందిళ్లు సిద్ధం చేశారు. కల్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు (CM Chandraabu) రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. రామాలయం ప్రాంగణం మొత్తం రంగురంగుల విద్యుద్దీపాలు, దేశ, విదేశాల్లో లభించే అరుదైన పుష్పాలతో చేసిన అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శుక్రవారం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు కల్యాణాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా ఆలయానికి సమీపంలో కల్యాణవేదిక ప్రాంతంలో 23 భారీ ఎల్ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ అశోక్కుమార్, జేఈవో వీరబ్రహ్మం గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. కల్యాణోత్సవ వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా భక్తులు తిలకించడానికి వీలుగా టీటీడీ ఎస్వీబీసీ చానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
సీతారాముల కల్యాణానికి కోటి తలంబ్రాలు
శుక్రవారం జరగనున్న సీతారాముల కల్యాణోత్సవానికి భక్తులు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కల్యాణ అప్పారావు ఆధ్వర్యంలో 120 కిలోల తలంబ్రాలను టీటీడీ అధికారులు హనుమంతయ్య, శ్రావణకుమార్కు గురువారం అందజేశారు. వీటికోసం మూడు నెలల పాటు వరిని ప్రత్యేకంగా పండించి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, తమిళనాడుకు చెందిన భక్తులు ఎంతో భక్తితో 3 నెలల పాటు గోటితో ఒలిచి సిద్ధం చేశారని తెలిపారు. ఈ సంఘం ఆధ్వర్యంలో గత 14ఏళ్లుగా భద్రాద్రి రామునికి, మూడేళ్లుగా అయోధ్యకు, ఎనిమిదేళ్లుగా ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవం సందర్భంగా కోటి తలంబ్రాలను అందజేస్తున్నట్లు అప్పారావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చాలా రోజులు ఖాళీగా ఇల్లు.. డోర్ ఓపెన్ చేయగా షాక్..
మార్క్ శంకర్ ఆరోగ్యంపై కీలక అప్ డేట్
For More AP News and Telugu News