Share News

Etela: కాంగ్రెస్‌కు పోయే కాలం దగ్గర పడింది..

ABN , Publish Date - Sep 28 , 2024 | 04:47 AM

అప్పట్లో ఇందిరాగాంఽధీ పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి సర్కార్‌ ఇళ్లు కూలగొడుతుందని.

Etela: కాంగ్రెస్‌కు పోయే కాలం దగ్గర పడింది..

  • ఓట్లు వేసిన ఖర్మానికి ఇళ్లు కూలగొడతారా?

  • పేదలతో పెట్టుకున్న ఏ సర్కారూ బాగుపడదు: ఈటల

అల్వాల్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): అప్పట్లో ఇందిరాగాంఽధీ పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి సర్కార్‌ ఇళ్లు కూలగొడుతుందని.. తెలంగాణలో నిజాం సర్కారు కంటే దుర్మార్గమైన పాలనను రేవంత్‌ రెడ్డి చేస్తున్నారని, హైడ్రా పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. పేదలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బాగుపడినట్లు చరిత్రలోనే లేదని, పేదలకు కళ్లనీళ్లు పెట్టించిన వారికి ఎప్పుడూ మంచి జరగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


కాంగ్రెస్‌ పార్టీ అంటే పేదల కోసమే ఉంటుందని, పేదలకు ఇళ్లు కట్టిస్తారని ఒకవైపు చెబుతూనే ఓట్లు వేసిన ఖర్మానికి పేదల ఇళ్లు కూలగొడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాని పోయే కాలం వచ్చిందని.. కేసీఆర్‌ నైజం బయటపడటానికి ఆరేళ్లు పడితే.. రేవంత్‌ సర్కార్‌ నైజం తెలవడానికి ఆరు నెలలు కూడా పట్టలేదన్నారు. అల్వాల్‌ జోన్నబండ పరిసర ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకున్న 70 మంది పేదల ఇళ్లకు అల్వాల్‌ తహసీల్దార్‌ నోటీసులిచ్చారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం జోన్నబండను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

Updated Date - Sep 28 , 2024 | 04:47 AM