ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Srinivas Goud: బీజేపీలో బీఆర్ఎస్ విలీనమా..? శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్

ABN, Publish Date - Aug 08 , 2024 | 05:33 PM

బీఆర్ఎస్‌పై కొంతమంది కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) సంచలన ఆరోపణలు చేశారు. కొంతమంది పార్టీ పని అయిపోయిందని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు.

Srinivas Goud

ఢిల్లీ: బీఆర్ఎస్‌పై కొంతమంది కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) సంచలన ఆరోపణలు చేశారు. కొంతమంది పార్టీ పని అయిపోయిందని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా కొందరికి పాత బుద్ధి మారలేదని విమర్శించారు. ఇప్పుడు బీజేపీలో విలీనం అంటూ అత్యుత్సాహంతో కథనాలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీపై కుట్రలు జరిగాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం. భూమి ఉన్నంత వరకు తమ పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని.. ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నిస్తుంది.. ప్రజల పక్షాన కొట్లాడుతుందని ఉద్ఘాటించారు. గురువారం నాడు ఢిల్లీ వేదికగా శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాక ముందు రాష్ట్ర పరిస్థితి, ఏర్పడ్డ తర్వాత పరిస్థితిని పోల్చి చూడాలని సూచించారు.


వ్యవసాయం, విద్యుత్, ఆర్థిక స్థితిగతులు, తెలంగాణ అస్తిత్వం ఎలా ఉండేదో గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. తెలంగాణ పేరు ఉచ్ఛరించడానికి కూడా కొంతమంది భయపడేవారని అన్నారు. సచివాలయంలో భాష (యాస) మార్చుకుని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ పేరు చెబితే గతంలో ఢిల్లీ ఏపీ భవన్‌లో గదులు కూడా ఇవ్వకపోయేవారని గుర్తుచేశారు. ఢిల్లీకి వస్తే పార్టీని విలీనం చేసినట్టా..? ఢిల్లీకి మేం రాకూడదా..? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టులో పోరాటం కోసం ఢిల్లీకి వచ్చామని వెల్లడించారు. కోడి గుడ్డుపై ఈకలు పీకినట్టు నోటికొచ్చింది ప్రసారం చేయడం తగదని అన్నారు. ఊహాజనితంగా కథనాలు రాయడం జర్నలిజానికి మంచిది కాదని వార్నింగ్ ఇచ్చారు.


ఇలాంటి కథనాలు రాస్తున్నది, ప్రసారం చేస్తున్నది ఎవరో కూడా అందరికీ తెలుసునని అన్నారు. ఇద్దరు ఎంపీలతో బీజేపీ ప్రస్థానం మొదలైందని.. అలాగని ఆ పార్టీ అక్కడితో ఆగిపోయిందా? అని నిలదీశారు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అంతే. కొందరు డబ్బులకు ఆశపడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని. అంతమాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయినట్టు కాదని తేల్చిచెప్పారు. ప్రజలు కూడా రైతు బంధు సహా చాలా పథకాలు ఎక్కువ ఇస్తామని చెబితేనే నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని అన్నారు. ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదని. కొన్నేళ్ల తర్వాత ప్రజలు మార్పు కోరుకుంటారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బలహీనపడలేదు. తాము బలంగానే ఉన్నామని అన్నారు.


ప్రజలు 39 సీట్లు ఇవ్వడం అంటే బలహీనమైనట్టు కాదని చెప్పారు. నిన్నగాక మొన్న మహబూబ్‌నగర్‌లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీని తాము గెలుచుకున్నామని గుర్తుచేశారు. ఒక జాతీయ పార్టీగా ఎదగాలని కోరుకోవడం తప్పేం కాదు కదా..? అని ప్రశ్నించారు. ఆ జాతీయ పార్టీ పక్క రాష్ట్రంలో ఏం చేసిందో ప్రజలు చూశారని అన్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానిగా మోదీయా.. రాహుల్ గాంధీయా అన్నదే చూశారని... అందుకే ప్రాంతీయ పార్టీలకు అవకాశం దక్కలేదని చెప్పారు. తాము అటో ఇటో ఉంటే బీఆర్ఎస్‌కు కూడా 10-15 సీట్లు వచ్చి ఉండేవని జోస్యం చెప్పారు. తాము ఈ రెండు కూటముల్లో లేకపోవడంతోనే ఫలితాలు ఇలా వచ్చాయని అన్నారు. ఎన్నికలప్పుడు లేని ఆలోచన ఇప్పుడు ఉండదని.. ఏ కూటమిలో చేరే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి లేదని తేల్చిచెప్పారు. ఇక విలీనం అన్న ప్రస్తావన అస్సలే లేదని... అది పూర్తిగా దుష్ప్రచారం మాత్రమేనని అన్నారు. ప్రజాగ్రహం ఎదురైతే బంగ్లాదేశ్‌లో ఏం జరిగిందో చూశాం. ఎక్కడైనా అలాగే జరుగుతుందని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

Updated Date - Aug 08 , 2024 | 05:33 PM

Advertising
Advertising
<