ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bandi Sanjay: డీఎస్‌‌కు నివాళి అర్పించనున్న కేంద్రమంత్రి బండి సంజయ్

ABN, Publish Date - Jun 29 , 2024 | 06:19 PM

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్.. తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.

Bandi Sanjay

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్.. తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు జరపనున్నది.


అయితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) హైదరాబాద్ రానున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా నిజామాబాద్‌లోని డీఎస్ నివాసానికి చేరుకోనున్నారు. డీఎస్‌కు నివాళి అర్పించడంతోపాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ నివాసానికి వెళ్లనున్నారు. రమేశ్ రాథోడ్ భౌతిక కాయానికి బండి సంజయ్ నివాళి అర్పించనున్నారు.

Updated Date - Jun 29 , 2024 | 06:21 PM

Advertising
Advertising