Share News

CM Revanth Reddy: ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

ABN , Publish Date - Jul 04 , 2024 | 02:57 PM

ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర నుంచి రావాల్సిన నిధులు, విభజన హామీలు, ఇతర అంశాలపై మోడీతో చర్చించారు.

CM Revanth Reddy: ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi)తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర నుంచి రావాల్సిన నిధులు, విభజన హామీలు, ఇతర అంశాలపై మోడీతో చర్చించారు. అంతకు ముందు హోంమంత్రి అమిత్ షాతో సైతం సీఎం భేటీ అయ్యారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ ఎన్నికపై రేవంత్ రెడ్డి ఇప్పటికే పార్టీ అధిష్ఠానంతో చర్చించారు. రెండో రోజు పర్యటనలో భాగంగా మోడీ, అమిత్ షాలను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా మోడీని కలిశారు.

Updated Date - Jul 04 , 2024 | 02:59 PM