Share News

వాడపల్లి వెంకన్న ఆదాయం రూ.2.91లక్షలు

ABN , Publish Date - Mar 14 , 2025 | 12:47 AM

వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి గురువారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీనెలకొంది.

వాడపల్లి వెంకన్న ఆదాయం రూ.2.91లక్షలు

ఆత్రేయపురం, మార్చి 13(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి గురువారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీనెలకొంది. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు జరిపారు. స్వామివారిని దర్శించుకున్న అన ంతరం భక్తులు అన్నప్రసాదంలో పాల్గొన్నా రు. వివిధ సేవల ద్వారా ఒకరోజు ఆదాయం రూ.2,91,194 వచ్చినట్టు ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావుతెలిపారు. వకుళమాత అన్నదాన భవన నిర్మాణానికి ఊబలంకకు చెందిన మేడపాటి అశ్వినిరెడ్డి కుటుంబ సభ్యులు రూ.1,01,116 విరాళం ఇచ్చారు. ఆలయ సిబ్బంది దాతలకు స్వామివారి చిత్రపటం అందించారు.

Updated Date - Mar 14 , 2025 | 12:47 AM