VIPs in Tirumala: శ్రీవారి సేవలో ప్రముఖులు
ABN , Publish Date - Apr 06 , 2025 | 05:28 AM
తిరుమల శ్రీవారి సేవలో న్యాయమూర్తి చీమలపాటి రవి, శక్తికాంత దాస్, మంత్రి మనోహర్ పాల్గొన్నారు. దర్శనానంతరం అన్నప్రసాదం స్వీకరించారు

తిరుమల, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి శక్తికాంత దాస్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా స్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం కుటుంబ సభ్యులతో కలిసి మనోహర్ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సత్రంలో అన్నప్రసాదం స్వీకరించారు.
ఇవి కూడా చదవండి
YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో
Tiruvuru Politics: తిరువూరులో రసవత్తరంగా రాజకీయం
Read Latest AP News And Telugu News