ప్రజా సమస్యల పరిష్కారమే ఽధ్యేయం
ABN , Publish Date - Mar 15 , 2025 | 12:13 AM
ప్రజలకు అందుబాటు లో ఉంటూ నిరంతరం వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిం చడమే ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.

పార్వతీపు రం రూరల్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు అందుబాటు లో ఉంటూ నిరంతరం వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిం చడమే ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. శుక్రవారం అసెంబ్లీ నుంచి వచ్చిన ఆయన.. నర్సిపురంలోగల తన క్యాంపు కార్యాలయంలో ప్రజావేదిక నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను విన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బాధితుల కు భరోసా ఇచ్చారు.