ఇండ్సఇండ్ ఖాతాదారులూ ఆందోళన వద్దు..
ABN , Publish Date - Mar 16 , 2025 | 04:46 AM
హిందూజా గ్రూప్నకు చెందిన ఇండ్సఇండ్ బ్యాంక్ తగినంత మూలధన నిల్వలను కలిగి ఉందని, బ్యాంక్ ఆర్థిక పరిస్థితి స్థిరంగానే ఉందని ఆర్బీఐ శనివారం ప్రకటన జారీ చేసింది...

బ్యాంక్ ఆర్థిక పరిస్థితి స్థిరంగానే ఉందన్న ఆర్బీఐ
ముంబై: హిందూజా గ్రూప్నకు చెందిన ఇండ్సఇండ్ బ్యాంక్ తగినంత మూలధన నిల్వలను కలిగి ఉందని, బ్యాంక్ ఆర్థిక పరిస్థితి స్థిరంగానే ఉందని ఆర్బీఐ శనివారం ప్రకటన జారీ చేసింది. బ్యాంక్ కార్యకలాపాలనూ తామూ నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది. అలాగే, బ్యాంక్లో వెలుగు చూసిన అకౌంటింగ్ లోపాలకు సంబంధించి ఈ నెలాఖరులోగా నివారణ చర్యలను పూర్తి చేయాలని ఇండ్సఇండ్ బ్యాంక్ బోర్డు, యాజమాన్యాన్ని ఆదేశించింది. తమ డెరివేటివ్ పోర్ట్ఫోలియోలో రూ.2,100 కోట్ల అకౌంటింగ్ వ్యత్యాసాన్ని గుర్తించామని, ఇది బ్యాంక్ విలువను దాదాపు 2.35 శాతం వరకు ప్రభావితం చేయవచ్చని ఇండ్సఇండ్ బ్యాంక్ ఈ వారంలో వెల్లడించింది. దాంతో బ్యాంక్ షేరు భారీగా క్షీణించడంతో చిన్న మదుపరులు, ఇతర ఇన్వెస్టర్లు నష్టపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆర్థిక పరిస్థితిపై ఖాతాదారుల్లోనూ ఆందోళనలు పెరగడంతో ఆర్బీఐ రంగంలోకి దిగింది.
ఇవి కూడా చదవండి:
Samsung: శాంసంగ్ నుంచి మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్..ఏకంగా ఆరేళ్లపాటు..
Pawan Kalyan: తమిళనాడు సీఎంకు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చురకలు..
Gold Silver Rates Today: భయపెడుతున్న బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్టెల్కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News