పార్లమెంట్లో సోనియా, రాహుల్ గాంధీని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు
ABN, Publish Date - Apr 03 , 2025 | 12:20 PM
పార్లమెంట్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలను గురువారం నాడు తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం కలిశారు. పార్టీ అంతర్గత చర్చలు, రాజకీయ వ్యూహాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు.

పార్లమెంట్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలను గురువారం నాడు తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం కలిశారు.

పార్టీ అంతర్గత చర్చలు, రాజకీయ వ్యూహాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈ సమావేశంలో సోనియా, రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు.

జంతర్ మంతర్లో బీసీ రిజర్వేషన్ల ధర్నా వివరాలను తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వివరించారు.

మంత్రులు, ఎంపీలను ఆప్యాయంగా సోనియా గాంధీ పలకరించారు. సోనియా గాంధీని 2008లో కలిశానని పాత జ్ఞాపకాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు.

తెలంగాణలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలని రాహుల్ గాంధీ ఆదేశించారు.

తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కాంగ్రెస్కు వెన్నంటే ఉన్నారని.. వారికి చేసే మేలు ప్రజలు మరవరని సోనియా గాంధీ ఉద్ఘాటించారు.
Updated at - Apr 03 , 2025 | 12:23 PM