Share News

గుర్తింపు సంఘాల వైఫల్యాలను కార్మికులకు తెలుపాలి

ABN , Publish Date - Apr 13 , 2025 | 12:17 AM

గుర్తింపు కార్మిక సంఘాల వైఫల్యాలను కార్మిక వర్గానికి తెలియజేసే బాధ్యత కార్యకర్తలదేనని టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. శనివారం ఆర్జీ-2 ఏరియా ముఖ్య కార్యక ర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. టీబీజీకేఎస్‌ పదేళ్ళ కాలంలో జాతీయ సంఘా లు పోగొట్టిన హక్కులను సాధించడమే కాకుండా కోల్‌ ఇం డియాలో లేని హక్కులు సాధించినట్టు తెలిపారు.

గుర్తింపు సంఘాల వైఫల్యాలను కార్మికులకు తెలుపాలి

యైుటింక్లయిన్‌కాలనీ, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): గుర్తింపు కార్మిక సంఘాల వైఫల్యాలను కార్మిక వర్గానికి తెలియజేసే బాధ్యత కార్యకర్తలదేనని టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. శనివారం ఆర్జీ-2 ఏరియా ముఖ్య కార్యక ర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. టీబీజీకేఎస్‌ పదేళ్ళ కాలంలో జాతీయ సంఘా లు పోగొట్టిన హక్కులను సాధించడమే కాకుండా కోల్‌ ఇం డియాలో లేని హక్కులు సాధించినట్టు తెలిపారు. కార్మికుడి తల్లి దండ్రులకు ఉచిత వైద్యం, మహిళలు, వికలాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మ్యాచింగ్‌ గ్రాంట్‌ పెంపు, ఉచిత ఏసీ కనక్షన్‌, లాభాల వాటా 16శాతానికి పెచడం, తెలంగాణ ఇంక్రిమెంట్‌ ఇప్పించిన ఘనత టీబీజీకేఎస్‌కు దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేపట్టనున్నట్టు ఆయన తెలి పారు. టీబీజీకేఎస్‌ కార్యకర్తలు కార్మికులకు అండగా ఉంటూ యూనియన్‌ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఆర్జీ-2 వైస్‌ ప్రెసిడెంట్‌ అయిలి శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో నాయకులు ప్రభాకర్‌రెడ్డి, సత్యం, శ్రీనివాస రెడ్డి, మామెడ తిరుపతి, అనిల్‌రెడ్డి, సురేందర్‌, కూర తిరుపతి, రవితేజ, హరిప్రసాద్‌, వెంకటేస్‌, శ్రీను, అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 12:17 AM