Shadnagar: షాద్నగర్లో గుర్తు తెలియని వ్యక్తి హత్య
ABN , Publish Date - Apr 14 , 2025 | 04:40 AM
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ బైపాస్ రోడ్డు సమీపంలో ఓ గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతని గొంతు కోసి, కడుపులో పొడిచి హత్య చేశారు.

షాద్నగర్రూరల్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా షాద్నగర్ బైపాస్ రోడ్డు సమీపంలో ఓ గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతని గొంతు కోసి, కడుపులో పొడిచి హత్య చేశారు. హత్యకు గురైన యువకుడి వయసు 25-30 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. అతడి కుడి చేతిపై జై బాలయ్య అనే టాటూ ఉందని, మెడలో ఉన్న లాకెట్లో ఓ వైపు వేంకటేశ్వర స్వామి, మరోవైపు అమ్మవారి బొమ్మ ఉందని చెప్పారు. మృతుడి వివరాలు తెలిసిన వారు షాద్నగర్ పోలీస్ స్టేషన్ నంబర్ 9440795741కు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు. మృత దేహాన్ని షాద్నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.