CM Chandrababu : టీడీఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం.. 8నెలల విజయాలపై చర్చ
ABN, Publish Date - Feb 28 , 2025 | 03:45 PM
సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. అసెంబ్లీ కమిటీ హాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, భేటీ అయ్యారు. ఎనిమిది నెలల్లో సాధించిన విజయాలపై చర్చించారు. అలాగే మిర్చి ధర పెంపు, రాష్ట్ర రహదారుల నిర్మాణంపై చర్చించారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈ భేటి ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ టీడీఎల్పీ భేటీలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.

అమరావతి: పార్టీని నేతలు ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయడు అన్నారు. ఇవాళ(శుక్రవారం) ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో టీడీఎల్పీ సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటలసేపు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో పార్టీ కేడర్కు చంద్రబాబు కీలక సూచనలు చేశారు.
ఈ భేటీలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... మళ్లీ గెలిచి రావాలనే పట్టుదలతో ఈ రోజు నుంచే పని చేయాలని కేడర్కు సూచించారు. రాబోయే ఎన్నికల్లో మీరందరూ మళ్లీ గెలవాలని అన్నారు. ఆర్థిక కష్టాలు ఉన్నా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ బడ్జెట్కు ఆమోదం తెలిపిన కేబినెట్..
శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి, త్రిశూలస్నానం..
వైఎస్సార్సీపీ కొత్త కుట్ర... వాట్సాప్ గ్రూపులు పెట్టించి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Feb 28 , 2025 | 04:31 PM