Home » Bengaluru News
బెంగళూరు ఈస్ట్ రైల్వే స్టేషన్(Bangalore East Railway Station)లో 3వ, 4వ లైన్ల పనుల కారణంగా గుంతకల్లు రైల్వే డివిజన్ గుండా వెళ్లే పలు రైళ్లకు ఆ స్టేషన్లో స్టాపింగ్ను తొలగించినట్లు రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
తండ్రి ఆస్పత్రిలో ఉన్నారని పరామర్శకు వెళ్లి వస్తున్న కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డారు. బెంగళూరు-వి.కోట(Bangalore-V.Kota) మధ్య ఇటీవల మొదలైన ఎక్స్ప్రెస్ వే(Express way)లో కర్నాటక రాష్ట్రం బంగారుపేట తాలూకా కుప్పనల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కంబళ క్రీడను అభిమానించేవారు ఎప్పటివరకు ఉంటారో... అప్పటిదాకా కొనసాగిస్తామని ప్రాణిదయాసంఘం (పెటా) తమ జోలికి రావద్దంటూ పుత్తూరు ఎమ్మెల్యే అశోక్కుమార్ రై(Puttur MLA Ashok Kumar Rai) తెలిపారు.
తీరప్రాంత జిల్లాల్లో మరో ఐదురోజులు వేడిగాలులతోపాటు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదు కానున్నాయని వాతావరణ పరిశోధనశాఖ హెచ్చరించింది. ప్రత్యేకించి ఉత్తర కన్నడ జిల్లాను ఎల్లో అలర్ట్గా ప్రకటించింది.
మహారాష్ట్ర(Maharashtra)లో కేఎస్ఆర్టీసీ సిబ్బందిపై దాడి, బస్సులకు రంగులు వేయడంతోపాటు బెళగావి(Belagavi)లో మరాఠీ మాట్లాడలేదని కండక్టర్పై దాడిని ఖండిస్తూ మార్చి 22న రాష్ట్రబంద్కు కన్నడ సంఘాల ఐక్యకూటమి అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్ పిలుపునిచ్చారు.
ఎటువంటి కలుషితం లేకుండా ఆవిరితో తయారయ్యే ఇడ్లీ(Idli) ఆరోగ్యానికి ఎంతో మేలని అందరూ భావిస్తారు. కానీ ఇటీవల ఇడ్లీ ద్వారా క్యాన్సర్ ప్రభావం పెరుగుతోందనే అంశం బహిరంగం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇడ్లీ పార్సిళ్లకు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు.
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో జరిగిన అవకతవకల విషయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని పూర్వపు మైసూరు జిల్లాధికారి ప్రస్తుతం రాయచూరు ఎంపీగా ఉన్న జీ కుమార్నాయక్ స్పష్టం చేశారు. బుదవారం నగరంలో విలేకరులతో మాట్లాడిన కుమార్ నాయక్, ముడా అవినీతి వ్యవహారానికి సంబంధించి లోకాయుక్త నుంచి తనకు ఎలాంటి సమాచారం గాని నోటీసు అందలేదన్నారు.
కోలారు జిల్లా కాంగ్రెస్ లో విభేదాలు భగ్గుమన్నాయి. కేజీఎఫ్ ఎమ్మెల్యే రూపకళ శశిధర్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి బైరతి సురేశ్(In-charge Minister Bairati Suresh) తీరుపట్ల మండిపడ్డారు.
‘నేను పుట్టుకతో హిందువును, కాంగ్రెస్ వాదిని, నా వ్యక్తిగతమైన నమ్మకాన్ని పాటిస్తానని కానీ బీజేపీతో సన్నిహితం అవుతున్నా’ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీసీఎం డీకే శివకుమార్(DCM DK Shivakumar) మండిపడ్డారు. సదాశివనగర్లోని నివాసం వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renuka Swamy) హత్యకేసులో నటుడు దర్శన్(Actor Darshan)తోపాటు నిందితులు అందరూ కోర్టు ముందు హాజరయ్యారు. మంగళవారం విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉండడంతో అందరూ వచ్చారు.