Home » BRS Chief KCR
కాంగ్రెస్ (Congress) బ్రిటిష్ వారసత్వాన్ని ఇంకా కొనసాగిస్తోందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి (Kishan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. బ్రిటిష్ ప్రతినిధిగా ఇటలీకి చెందిన సోనియాగాంధీని దేశంపై రుద్దే ప్రయత్నం చేశారని విరుచుకుపడ్డారు. ఆమె ప్రధాని కాకుండా బీజేపీ అడ్డుకుందని గుర్తుచేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సంచలన ఆరోపణలు చేశారు. విభజన హామీలను బీజేపీ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటును మోదీ అవహేళన చేశారని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం అన్నింటి మీద జీఎస్టీ వసూలు చేస్తుందన్నారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ సంస్కృతి గురించి తెలియదని మండిపడ్డారు.
లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ (BRS) పార్టీకి భారీ షాక్ తగిలింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ భారీ ఓటమిని చవిచూసిన విషయం తెలసిందే. ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో కీలక నేతలంతా వరుసగా రాజీనామాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ పార్టీ కీలక నేతలు బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ (Congress party)లో చేరుతున్నారు. ఇదే కోవలో కొత్తగూడెం బీఆర్ఎస్ సీనియర్ నేత కోనేరు చిన్ని ( Koneru Chini) కూడా గులాబీ పార్టీని వీడేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు.
కాళేశ్వరం (Kaleshwaram) బ్యారేజీల అవకతవకలు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం తదితర విషయాలపై విచారించడానికి జస్టిస్ చంద్ర గోష్ (Justice Chandra Ghosh) కమిషన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన విషయం తెలిసిందే. నేటి(గురువారం) నుంచి జస్టిస్ చంద్ర ఘోష్ విచారణను ప్రారంభించారు. ఈ విచారణలో పలు కీలక అంశాలను దృష్టిలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అన్నారు. మంగళవారం నాడు పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ (Congress) అంటేనే కరువు, కరెంట్ కోతలు, మంచినీళ్ల కష్టాలు, అవినీతి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు (Harish Rao) అన్నారు. సోమవారం నాడు కొండాపూర్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో హరీష్ రావు సమావేశం అయ్యారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ - బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తోడు దొంగలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం నాడు ఆదిలాబాద్ జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బీజేపీ, బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
తమ ప్రభుత్వం ఉండదంటావా లాగులో తొండలు వేసి నల్గొండ బిడ్డలతో కొట్టిపిస్తానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) హెచ్చరించారు. ఇంకోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం నాడు భువనగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అబద్ధాలు ఆడడంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు (Harishrao) ఆరోపించారు.
తెలంగాణ ప్రజలు పదేళ్లపాటు దొరల పాలన చూశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శనివారం నాడు మెదక్లో జరిగిన జనజాతర సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలపై రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సభలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.