Home » Budget 2024
ఎన్నికల ముందు మరో ‘బడ్జెట్ బండి’ దూసుకొచ్చింది. ‘ఓటాన్’ బడ్జెట్ కాస్తా మధ్యంతర బడ్జెట్గా మారిపోయింది. పదేళ్ల ‘ప్రగతి’పై వివరణ! వరాలూ... వడ్డింపులు లేకుండా... అందమైన భవిష్యత్ వర్ణనతో బడ్జెట్ కథా చిత్రం రక్తి కట్టింది. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజాకర్షక ప్రకటనలు
కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారంనాడు పార్లమెంటులో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. బడ్జెట్పై జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీజేపీని పరోక్షంగా ప్రస్తావిస్తూ 'అబ్ కీ బార్, 400 పార్' అంటూ వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా అధికార పార్టీ సభ్యుల్లో నవ్వులు వెల్లివిరిసాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం చిరునవ్వులు చిందించారు.
గురువారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడుతూ.. ‘ఐమెక్’ (IMEC) ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించారు. రాబోయే వందేళ్లలో ఈ ప్రాజెక్ట్ ప్రపంచ వాణిజ్యానికి ఆధారం కానుందని, భారత్తో పాటు యావత్ ప్రపంచానికే ఇది గేమ్చేంజర్గా మారుతుందని పేర్కొన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (01/02/24) మధ్యంతర బడ్జెట్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు రానున్న తరుణంలో.. తమకు తప్పకుండా ప్రయోజనాలు ఉంటాయని, ఆర్థిక మంత్రి భారీ ప్రకటనలు చేస్తారని అన్ని రంగాల వాళ్లు అభిప్రాయపడ్డారు. ఆశించినట్టుగానే కొందరికి ప్రయోజనాలు చేకూరేలా నిర్మలా సీతారామన్ ప్రకటనలిచ్చారు.
త్వరలోనే లోక్సభ ఎన్నికలు రాబోతున్న తరుణంలో.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను వర్గాలకు ఊరట కల్పించేలా నిర్ణయం తీసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ.. వారి ఆశలపై నీళ్లు చల్లుతూ గతేడాది ప్రతిపాదించిన కొత్త పన్ను విధానాన్నే ఈసారి కూడా కొనసాగించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లో యువత, టెక్ రంగ నిపుణులు, కంపెనీలకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు. సాంకేతిక రంగాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో లక్ష కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల ముందు చివరి బడ్జెట్ కావడంతో మధ్యతరగతి జీవులకు ఏమైనా ఉపశమనం ఉంటుందేమో.. ఆదాయ పన్నులకు సంబంధించిన ఉపశమన ప్రకటనలు ఏమైనా ఉంటాయేమోనని అంతా భావించారు. మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ కేంద్రం సాహసోపేతంగా ఏవైనా ప్రకటనలు చేస్తుందేమోనన్న చిన్న అనుమానాలు కలిగాయి. కానీ అవన్నీ పటాపంచలయ్యాయి.
బడ్జెట్ రోజున దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలలో విపరీతమైన ఒడిదొడుకులు కనిపించాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ, ప్రధాన సూచీలు చివరికి నష్టాల్లో ముగిశాయి.
మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 'ప్రగతి శీలక బడ్జెట్'గా అభివర్ణించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించేందుకు ఈ బడ్జెట్ ఒక గ్యారెంటీ ఇచ్చిందన్నారు.